Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరేడు గింజల పొడిని నీటిలో కలుపుకుని తాగితే? (video)

నేరేడు ఆకుల కషాయంతో బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి తప్పించుకోవచ్చు. నేరేడు ఆకులను మెత్తగా నూరి రోజుకు అర స్పూన్ తీసుకుంటే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అలాగే నేరేడు పండ్లను ఊబకాయులు, మధుమ

Webdunia
బుధవారం, 10 అక్టోబరు 2018 (11:35 IST)
నేరేడు ఆకుల కషాయంతో బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి తప్పించుకోవచ్చు. నేరేడు ఆకులను మెత్తగా నూరి రోజుకు అర స్పూన్ తీసుకుంటే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అలాగే నేరేడు పండ్లను ఊబకాయులు, మధుమేహులు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. 
 
మధుమేహులు నేరేడు గింజల పొడిని నీటిలో కలుపుకుని తాగితే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. నేరేడు పండ్లు తింటే కాలేయ సంబంధిత సమస్యలు తొలగిపోయి కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. అజీర్తితో ఇబ్బంది ఏర్పడితే నాలుగు పండిన నేరేడు పండ్లను తింటే ఉపశమనం కలుగుతుంది. 
 
నేరేడులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు, గుండె ఆరోగ్యానికి రక్షగా నిలుస్తాయి. రక్తక్యాన్సర్‌ కారకాలను కూడా నిరోధిస్తాయి. అధిక జ్వర బాధితులు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. యూరినల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే.. నిమ్మ, నేరేడు రసాన్ని రెండేసి చెంచాల చొప్పున నీటిలో కలిపి తీసుకుంటే ఉపశమనం వుంటుంది.  
 
నేరేడు ఆకుల కషాయంతో నోరు పుక్కిలిస్తే పంటినొప్పి, చిగురువాపు, నోట్లో పుండ్లు, నోటి దుర్వాసన వంటి సమస్యలు దూరమవుతాయి. నెలసరి సమస్యలున్నవారు నేరేడు బెరడు కషాయాన్ని నెలరోజులు ఓ స్పూన్ మోతాదులో రెండుసార్లు తీసుకుంటే మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Covid Panic: బెంగళూరులో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు- మార్గదర్శకాలను పాటించాల్సిందే

COVID: హైదరాబాద్‌లో కోవిడ్-19 కేసు- డాక్టర్‌కు కరోనా.. ఇప్పుడెలా వున్నారంటే?

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

తర్వాతి కథనం
Show comments