Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున పచ్చి కరివేపాకులు నమిలి తింటే...

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (14:05 IST)
కరివేపాకు లేనిదే ఏ కూర చేయరు. అంటే భారతీయ వంటల తయారీలో కరివేపాకుకు అంత స్థానం ఉందన్నమాట. అలాంటి కరివేపాకును కొందరు ఇష్టంగా ఆరగిస్తే మరికొందరు మాత్రం ఆకు కదా అని తీసిపారేస్తారు. నిజానికి కరివేపాకులో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే ఏ ఒక్కరూ కూడా దాన్ని తీసిపడేయరు. అలాంటి కరివేపాకులో ఉన్న ఔషధ గుణాలు ఏంటో పరిశీలిద్ధాం. 
 
* ప్రతిరోజూ ఉదయాన్ని పరగడుపున 5 లేదా 10 కరివేపాకులను అలానే పచ్చివి నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుంది. ముఖ్యంగా రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 
 
* కరివేపాకు పొడితో అన్నం ఆరగిస్తే అజీర్తి తగ్గిపోతుంది. పైగా, ఆకలి పెరుగుతుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అయితే, కరివేపాకులకు మెంతులు, మిరియాలు కూడా కలిపి పొడి చేసుకుంటే ఇంకా మంచిది. 
 
* కరివేపాకులో అనేక పోషకాలు ఉన్నాయి. కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, ఆంటీయాక్సిడెంట్స్, కెరోటిన్, ప్రొటీన్స్, కొవ్వు పదార్థాలతో పాటు.. పిండిపదార్థాలు, ఫైబర్, మినరల్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల నిత్యం కరివేపాకును ఆరగించడం వల్ల పైన చెప్పిన పోషకాలన్నీ శరీరానికి లభ్యమవుతాయి. 
 
* మజ్జిగలో కరివేపాకు ఆకుల రసం కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. కొబ్బరినూనెలో కొద్దిగా కరివేపాకు పేస్ట్ వేసి బాగా మరగబెట్టి అనంతరం వచ్చే ద్రవాన్ని వడబోసి వెంట్రుకలకు రాసుకుంటే వెంట్రుకలు నిగనిగలాడుతాయి. జట్టు సమస్యలూ తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments