Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యపురిలో రామమందిరం.. తొలి ఇటుక వేసిన ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (13:07 IST)
అయోధ్యపురిలో రామాలయం కొలువు తీరాలన్న కోట్లాది హిందువుల కల నెరవేరనుంది. బృహత్తర ఆలయ నిర్మాణానికి బుధవారం మధ్యాహ్నం భూమిపూజ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవం అట్టహాసంగా జరిగింది. 
 
అయోధ్యలో కూడా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కట్టడి చర్యలు తీసుకుంటూనే.. ముందుజాగ్రత్త చర్యగా అతిథుల జాబితాను ఆలయ నిర్మాణ ట్రస్టు కుదించి వేసింది. సంఘ్‌ అధినేత మోహన్‌ భాగవత్‌, ఆయన సహచరులు తరలిరానుండగా.. రామజన్మభూమి ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లిన బీజేపీ అగ్రనేతలు ఎల్కేఅద్వానీ, సీనియర్ నేత మురళీ మనోహర్‌ జోషీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
కాగా, అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణం కోసం జరిగిన భూమిపూజలో జై శ్రీరామ్ పేరు ఉన్న 9 ఇటుకలను వినియోగించినట్లు పూజారులు తెలిపారు. దేశవిదేశాల్లోని రామ భక్తులు వీటిని పంపినట్లు వారు చెప్పారు. 1989లో రామ మందిరం నిర్మాణం కోసం సుమారు 2.75 లక్షల ఇటుకలను రామ భక్తులు అయోధ్యకు పంపినట్లు వివరించారు. ఇందులో జై శ్రీరామ్ పేరు ఉన్న వంద ఇటుకలను భూమిపూజ, అనంతర నిర్మాణ పనుల కోసం వినియోగిస్తారని పూజారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments