Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ

అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ
, బుధవారం, 5 ఆగస్టు 2020 (13:02 IST)
అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం భూమి పూజ చేస్తున్నారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి మొదటి ఇటుకను ఆయన వేయనున్నారు.
 
బుధవారం అయోధ్యలో జరిగే రామ మందిరం భూమిపూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అథితిగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలోని ఫొటోగ్రాఫర్ మహేంద్ర త్రిపాఠి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. 
webdunia
29 యేళ్ల క్రితం అంటే 1991లో రామ్‌లల్లా జన్మోత్సవ కార్యక్రమం సందర్భంగా బీజేపీ సీనియర్‌ నేత మురళీమనోహర్‌ జోషితో కలిసి మోడీ అయోధ్యలో పర్యటించారని ఆయన గుర్తుచేశారు. తాను ఆ సమయంలో వీహెచ్‌పీ కోసం ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తుండేవాడినని, అక్కడ కొంతమంది జర్నలిస్టులు కూడా తనతో ఉన్నారన్నారు.
webdunia
మోడీని బీజేపీ గుజరాత్‌ నాయకుడిగా విలేకరులకు మురళీ మనోహర్ జోషి పరిచయం చేశారని చెప్పారు. తనతో పాటు మరికొంత మంది జర్నలిస్టులు మోడీని అయోధ్యకు తిరిగి ఎప్పుడు వస్తారని అడిగారని చెప్పాడు. 
webdunia
దీనిపై మోడీ స్పందిస్తూ, రామ్ మందిర నిర్మాణం ప్రారంభమైనప్పుడే తిరిగి తాను అయోధ్యకు వస్తానని చెప్పారని వివరించారు. అప్పట్లో మోడీ తాను ఇచ్చిన మాట ఇప్పుడు నిలబెట్టుకున్నారని ఆయన అన్నాడు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇది... అయోధ్య నగరలో ఆలయ నిర్మాణ చరిత్ర