Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరాముడు అందరివాడు.. అమెరికాలో ప్రత్యేక పూజలు.. రాముడి త్రీడీ చిత్రాలు

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (20:06 IST)
Lord Rama
రాముడు అందరివాడు... అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బుధవారం భూమి పూజ జరుగనుంది. ఈ సందర్భంగా రామ భక్తులంతా.. పండుగ చేసుకుంటున్నారు. అయోధ్యలో ఇప్పుడే పండగ వాతావరణం నెలకొంది. అలాగే ప్రపంచ దేశాల్లోని హిందువులు రాముడి కోసం ప్రత్యేక పూజలు చేసుకుంటున్నారు. 
 
ఈ క్రమంలో అయోధ్యలో బుధవారం జరుగనున్న రామమందిరం భూమిపూజ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అమెరికాలోని అన్ని హిందూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించనున్నారు. కోట్ల మంది ప్రజల విశ్వాసానికి ఈ రామాలయం ప్రతీక అని, అమెరికా అంతటా వర్చువల్‌ ప్రార్థనలు నిర్వహించాలని ఇండో అమెరికన్‌ హిందూ నాయకులు పిలుపునిచ్చారు.
 
ఇందులో భాగంగా మంగళవారం రాత్రి అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నగర వీధులతో సహా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వద్ద రాముడి చిత్రాలను, మందిర చిత్రాలను పెద్దపెద్ద ఎల్‌ఈడీ తెరలపై ప్రదర్శించనున్నారు. శంకుస్థాపన జరిగే ఆగస్టు 5న న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌లోని బాహ్య తెరలపై రాముడి త్రీడీ చిత్రాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకుగాను 17 వేల చదరపు అడుగుల బాహ్య తెరలను లీజుకు తీసుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments