వైసీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కై టీడీపీని వేధిస్తున్నారు

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (16:03 IST)
కొందరు పోలీసుల వ్యవహారశైలి శృతి మించుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. శాంతి భద్రతలను రక్షించాల్సిన పోలీసులు, వైసీపీ నేతలతో కుమ్మక్కై టీడీపీ నేతలను అక్రమ అరెస్టులతో వేధిస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేశారన్న కారణంతో, టీడీపీ కార్యకర్త అంజిపై అక్రమ కేసులు పెట్టి హింసించారన్నారు.

కండ్రికలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడితే, దాడి చేసినవారిని వదిలేసి టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో తప్పుడు కేసులతో ఎఫ్ఐఆర్‌ పుస్తకాలన్నీ నిండిపోయాయన్నారు. తప్పుడు కేసులకు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. వైసీపీ పాలనలో పోలీసుల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments