Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క‌రెంటు బిల్లుల కాల్చివేత‌... బెజ‌వాడ‌లో సిపిఐ గ‌రం గ‌రం!

క‌రెంటు బిల్లుల కాల్చివేత‌... బెజ‌వాడ‌లో సిపిఐ గ‌రం గ‌రం!
విజయవాడ , సోమవారం, 13 సెప్టెంబరు 2021 (14:10 IST)
పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను రద్దు చేయాల‌ని సిపిఐ విజ‌య‌వాడ నగర కార్యవర్గ సభ్యుడు కే వి భాస్కర రావు డిమాండ్ చేశారు. సిపిఐ విజ‌య‌వాడ‌లోని 58 డివిజన్ ఆధ్వర్యంలో హోచిమిన్ భవన్ వద్ద పెంచిన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేశారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో పెంచిన విద్యుత్ బిల్లుల‌ను సీపిఐ కార్య‌క‌ర్త‌లు ద‌హ‌నం చేశారు. 
 
ఈ సందర్భంగా కె వి భాస్కర రావు మాట్లాడుతూ, కరోనా కష్టాలతో నలిగిపోయిన ప్రజలకు మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లు సర్దుబాటు చార్జీల పేరిట కరెంటు చార్జీలను ఏకంగా యూనిట్ కి 1.23 పైసలు పెంచడం దారుణమన్నారు. ఇది వరకే పెంచిన పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలతోపాటు ప్రస్తుతం పెంచిన విద్యుత్ చార్జీలతో ప్రజల నెత్తిన పిడుగు పడినట్లుగా ఉంద‌ని పేర్కొన్నారు.
 
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పెరిగిన విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే పోరాటాల ద్వారా ముందుకు వెళ్తామన్నారు, ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, ఎస్కే సుభాని, ఎల్ శివకుమార్, కె ఆదినారాయణ చంద్ర ,రవికుమార్, పి రాములు యన్ లక్ష్మీనారాయణ, ఎండి గౌస్ , నాగరాజు, నాగూర్ మీరా, మహిళా నాయకురాలు తమ్మిన దుర్గ ,పుష్ప ,కన్నమ్మ శంకరమ్మ,రాజ్యలక్ష్మి షకీలా పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరీంనగర్ జిల్లాలో దారుణం: యువకుడిపై పెట్రోల్ పోసి..!