Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు, వేమూరి హ‌రికృష్ణే ఏపీ ఫైబర్‌నెట్‌లో అవకతవకల‌కు బాధ్యులు

Advertiesment
చంద్రబాబు, వేమూరి హ‌రికృష్ణే ఏపీ ఫైబర్‌నెట్‌లో అవకతవకల‌కు బాధ్యులు
విజయవాడ , సోమవారం, 13 సెప్టెంబరు 2021 (14:00 IST)
చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌ నెట్‌లో అవకతవకలు జరిగాయని ఏపీ ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ గౌతమ్‌రెడ్డి అన్నారు. విజ‌య‌వాడ‌లోని ఏపీ ఫైబర్‌నెట్ కార్యాల‌యంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నారా చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా, బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్నకంపెనీకి టెండర్‌ కట్టబెట్టారన్నారు. ఏడాది సస్పెన్షన్ ఉన్నా, టెరా సాఫ్ట్ కంపెనీకి రెండు నెలల్లోనే టెండర్‌ కట్టబెట్టారన్నారు. టెరా సాఫ్ట్‌కు టెండర్‌ కేటాయించేందుకే కాల పరిమితిని కూడా పొడిగించారన్నారు. 
 
చంద్రబాబు, వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ కలిసే కుట్రకు పాల్పడ్డారని గౌతమ్‌రెడ్డి మండిపడ్డారు. వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను టెరా సాఫ్ట్‌లో రాజీనామా చేయించి ఫైబర్ నెట్‌లో డైరెక్టర్‌గా తీసుకున్నారన్నారు.టెండర్లలో అవకతవకలపై అభ్యంతరాలను కూడా పరిశీలించలేదని గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు. 19 మందిపై సీఐడీ అనుమనితులుగా కేసులు నమోదు చేసింద‌ని, దర్యాప్తు  పూర్తయ్యాక మరింత మంది పాత్ర వెలుగులోకి రావొచ్చని గౌతమ్‌రెడ్డి అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య నిద్రపోగానే కుమార్తెపై అత్యాచారం.. ఏడాదిన్నరగా ఫిజియోథెరపిస్టు అరాచకం