Webdunia - Bharat's app for daily news and videos

Install App

విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరగాలంటే హైదరాబాద్‌ను రాజధానిగా ఉంచాలి : వైవీ సుబ్బారెడ్డి

ఠాగూర్
మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (17:10 IST)
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరగాలంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని మరికొంతకాలం ఉంచాలని వైకాపా ప్రధాన కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి పదేళ్ళు కావొస్తుందన్నారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినపుడు హైదరాబాద్ నగరాన్ని పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇపుడా గడువు కూడా పూర్తికావొస్తుందని, ఈ నేపథ్యంలో మరో ఈ గడువును మరో పదేళ్లపాటు పొడగించాలని ఆయన కోరారు. 
 
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి మేలు జరగాలంటే హైదరాబాద్ నగరం మరి కొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది తమ ఆలోచన అని చెప్పారు. విశాఖ రాజధాని కార్యసాధన పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ముగిసిన తర్వాత వైకాపా నాయకత్వం దీనిపై దృష్టిసారిస్తుందని తెలిపారు. రాజధాని నిర్మించకుండా ఐదేళ్లపాటు తాత్కాలికం పేరుతోనే తెలుగుదేశం పార్టీ కాలయాపన చేసిందని ఆయన విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments