Webdunia - Bharat's app for daily news and videos

Install App

విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరగాలంటే హైదరాబాద్‌ను రాజధానిగా ఉంచాలి : వైవీ సుబ్బారెడ్డి

ఠాగూర్
మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (17:10 IST)
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరగాలంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని మరికొంతకాలం ఉంచాలని వైకాపా ప్రధాన కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి పదేళ్ళు కావొస్తుందన్నారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినపుడు హైదరాబాద్ నగరాన్ని పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇపుడా గడువు కూడా పూర్తికావొస్తుందని, ఈ నేపథ్యంలో మరో ఈ గడువును మరో పదేళ్లపాటు పొడగించాలని ఆయన కోరారు. 
 
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి మేలు జరగాలంటే హైదరాబాద్ నగరం మరి కొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది తమ ఆలోచన అని చెప్పారు. విశాఖ రాజధాని కార్యసాధన పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ముగిసిన తర్వాత వైకాపా నాయకత్వం దీనిపై దృష్టిసారిస్తుందని తెలిపారు. రాజధాని నిర్మించకుండా ఐదేళ్లపాటు తాత్కాలికం పేరుతోనే తెలుగుదేశం పార్టీ కాలయాపన చేసిందని ఆయన విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments