విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరగాలంటే హైదరాబాద్‌ను రాజధానిగా ఉంచాలి : వైవీ సుబ్బారెడ్డి

ఠాగూర్
మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (17:10 IST)
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరగాలంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని మరికొంతకాలం ఉంచాలని వైకాపా ప్రధాన కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి పదేళ్ళు కావొస్తుందన్నారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినపుడు హైదరాబాద్ నగరాన్ని పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇపుడా గడువు కూడా పూర్తికావొస్తుందని, ఈ నేపథ్యంలో మరో ఈ గడువును మరో పదేళ్లపాటు పొడగించాలని ఆయన కోరారు. 
 
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి మేలు జరగాలంటే హైదరాబాద్ నగరం మరి కొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది తమ ఆలోచన అని చెప్పారు. విశాఖ రాజధాని కార్యసాధన పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ముగిసిన తర్వాత వైకాపా నాయకత్వం దీనిపై దృష్టిసారిస్తుందని తెలిపారు. రాజధాని నిర్మించకుండా ఐదేళ్లపాటు తాత్కాలికం పేరుతోనే తెలుగుదేశం పార్టీ కాలయాపన చేసిందని ఆయన విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments