Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా పర్యటనలో వైవీ దంపతులు

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (18:38 IST)
టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఆస్ట్రేలియాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో భారత డిప్యూటీ హై కమిషనర్‌ కార్తికేయన్ తోపాటు అక్కడ స్థిరపడిన తెలుగు వాణిజ్య వేత్తలతో భేటీ అయ్యారు.

రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు చేపడుతున్న విధానాలను వివరించారు. రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు వైవీ వెల్లడించారు.

గత  ప్రభుత్వం బడ్జెట్ లోని సింహ భాగం నిధులు కొద్దిమంది ప్రయోజనాల కోసం ఖర్చు పెడితే.. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మాత్రం ప్రజలు చెల్లించే పన్నులను తిరిగి సామాన్య ప్రజలకే చేర్చే విధంగా పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.

ఎన్‌ఆర్‌ఐలు వైవిధ్యమైన ప్రాజెక్టులతో ముందుకు రావాలని సుబ్బారెడ్డి అభిలషించారు. హెలిన్స్‌బర్గ్‌లోని శ్రీవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. విదేశాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఆస్ట్రేలియా పార్లమెంటును సందర్శించి అక్కడ ప్రజాప్రతినిధుల సభలు నిర్వహించే తీరును పరిశీలించారు. తొలుత ఆస్ట్రేలియా ఉపఖండంలోని తెలుగు ప్రజలు సుబ్బారెడ్డి, స్వర్ణలతారెడ్డికి ఘన స్వాగతం పలికారు.

కార్యక్రమంలో అక్కడి వైసీపీ నాయకులు చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి, శేఖర్, విశ్వనాథ్, హర్ష, విజయ్, శ్రీధర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments