Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"అమ్మ ఒడి" పథకానికి మరో మెలిక... మార్గదర్శకాలివే...

, మంగళవారం, 5 నవంబరు 2019 (16:20 IST)
అమ్మ ఒడి పథకానికి వైకాపా ప్రభుత్వం మరో మెలిక పెట్టింది. ఈ పథకం కింద విద్యార్థులు లబ్ది పొందాలంటే కనీసం 75 శాతం హాజరు ఉండాల్సిందేనన్న నిబంధన విధించింది. 
 
విద్యాసంవత్సరం మధ్యలోనే చదువును నిలిపివేస్తే(డ్రాపవుట్‌).. సదరు విద్యార్థులను ఈ పథకం నుంచి తొలగించనున్నారు. దీనిని అధిగమించేందుకు పాఠశాలలకు పిల్లలను ప్రతిరోజూ తప్పకుండా పంపాలని ప్రభుత్వం సూచించింది. 
 
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ సోమవారం అమ్మఒడికి మార్గదర్శకాలను జారీ చేశారు. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
* ఈ పథకం కింద విద్యార్థి తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకునికి యేడాదికి రూ.15 వేలు చొప్పున అందిస్తుంది. 
* పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న కుటుంబంలోని ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
* దారిద్య్రరేఖకు దిగువన(బీపీఎల్‌) ఉన్న కుటుంబం అయి ఉండాలి. కుటుంబానికి తెల్లరేషన్‌ కార్డు ఉండాలి. 
* లబ్ధిదారుడు/తల్లి ఆధార్‌ కార్డును కలిగి ఉండాలి. విద్యార్థులకు ఆధార్‌ కార్డు కచ్చితంగా ఉండాలి.
* తల్లి మరణిస్తే సంరక్షకుడికి రూ.15 వేలు ఇస్తారు. 
* లబ్ధిదారుడి పిల్లలు 1 నుంచి 12 తరగతులలో ఏపీ ప్రభుత్వం గుర్తించిన ప్రభుత్వ, ప్రైవేట్‌ ఎయిడెడ్‌, ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో చదువుతూ ఉండాలి.
* విద్యార్థి కనీసం 75 శాతం హాజరును కలిగి ఉండాలి.
* రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ, పీఎస్‌యూ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ అమ్మ ఒడి పథకానికి అనర్హులు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయా రెడ్డి హత్యపై నిరసన చేస్తున్న రెవిన్యూ సిబ్బందికి చేదు అనుభవం, విరుచుకుపడిన మహిళ