Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ బాట‌లో.... మంద కృష్ణ మాదిగ‌కు షర్మిల ప‌రామ‌ర్శ‌

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (12:33 IST)
కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిష‌న్ రెడ్డి మంద కృష్ణ మాదిగ‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తూ, ఆయ‌న్ని ఆసుప‌త్రిలో ప‌రామ‌ర్శించ‌డం, ఉప రాష్ట్ర‌ప‌తి వ‌ద్ద‌కు తీసుకెళ్ళ‌డం చేశారు. ఇపుడు అదే బాట‌లో 
తెలంగాణ పార్టీ అధినాయ‌కురాలు వైయ‌స్ ష‌ర్మిల ప‌య‌నిస్తున్నారు. హైద‌రాబాదులోని విద్యానగర్ లోని ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ  నివాసానికి వెళ్లి ప‌రామ‌ర్శించారు.
 
మంద‌కృష్ణ మాదిగకి ఇటీవ‌ల ఢిల్లీలో శ‌స్త్రచికిత్స జ‌ర‌గ‌గా, ఆయ‌న‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మందకృష్ణ మాదిగ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. 
 
అనంత‌రం సెప్టెంబ‌ర్‌ 12వ తేదీన ఆదివారం న‌ల్ల‌గొండ జిల్లా తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం తిరుమ‌ల‌గిరి ప‌ట్ట‌ణంలో వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీ నిర్వ‌హించ‌బోయే "ద‌ళిత భేరి" బ‌హిరంగ స‌భ‌కు ఆహ్వానించారు. ద‌ళితుల ప‌క్షాన పోరాటానికి  మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని మంద‌కృష్ణ మాదిగని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments