Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోతుల దాడి నుంచి తప్పించుకునేందుకు...

కోతుల దాడి నుంచి తప్పించుకునేందుకు...
, బుధవారం, 8 సెప్టెంబరు 2021 (11:49 IST)
కోతుల దాడి నుంచి తప్పించుకునేందుకు ఓ మహిళ రెండో అంతస్తు నుంచి జారి కిందపడటంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వివరాల్లోకి వెళితే ఈ ప్రాంతానికి చెందిన సుష్మా మహిళ ఉదయం ఆలయానికి వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చేసరికి అక్కడ కోతుల గుంపు చేరింది. షుష్మా వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తుండగా, అవి ఆమెపై దాడి చేశాయి. 
 
దీంతో ఆమె పట్టుతప్పి రెండవ అంతన్థు నుంచి కాలుజారి కింద పడ్డారు. వెంటనే ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్థారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈమె స్థానిక బీజేపీ నేత భార్య కావడం గమనార్హం. 
 
ఇదిలావుంటే, షామ్లీ పరిధిలోని కైరానాలో కోతుల దాడులు అధికమైపోయాయి. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బీజేపీ నేత అనిల్ చౌహాన్ భార్య, పంచాయతీ మాజీ సభ్యురాలు సుష్మా చౌహాన్ మృతి చెందారనే వాదన వినిపిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా క్యాడర్ ఏమైనా క‌రోనా రహిత కార్యకర్తలా? : బీజేపీ నేత విష్ణువర్థన్