Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్లలో కారం చల్లి.. గొడ్డళ్లు, వేటకొడవలితో వైకాకా కార్యకర్తల హత్య

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2023 (12:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. కూనిరెడ్డి కృష్ణారెడ్డి అనే వైకాపా కార్యర్తను ప్రత్యర్థులు గొడ్డళ్లు, వేటకొడవళ్ళతో నరికి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. జిల్లాలోని జంగమహేశ్వరం గ్రామంలో ఈ హత్య జరిగింది. అధికార పార్టీ కార్యకర్త ఒకరు హత్యకు గురికావడం జిల్లాలో కలకలం రేపింది. కృష్ణారెడ్డి మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితులు చేజారిపోకుండా గ్రామంలో భారీగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. కృష్ణారెడ్డిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 
 
కృష్ణారెడ్డి పులిపాడు ప్రభుత్వ వైన్ షాపులో సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. ముసుగులు ధరించిన ఐదుగురు ప్రత్యర్థులు కళ్ళలో కారం చల్లి హత్య చేశారని స్థానికులు తెలిపారు. ఈ హత్యకు రాజకీయ కారణాలా లేక ఇతర కారణాలా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గురజాల మండలంలో ఉన్న జంగమహేశ్వరం గ్రామానికి ఫ్యాక్షన్ చరిత్ర ఉండటం గమనార్హం. మరోవైపు, టీడీపీ వాళ్లే ఈ హత్యకు చేయించారని వైకాపా శ్రేణులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments