Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్లలో కారం చల్లి.. గొడ్డళ్లు, వేటకొడవలితో వైకాకా కార్యకర్తల హత్య

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2023 (12:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. కూనిరెడ్డి కృష్ణారెడ్డి అనే వైకాపా కార్యర్తను ప్రత్యర్థులు గొడ్డళ్లు, వేటకొడవళ్ళతో నరికి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. జిల్లాలోని జంగమహేశ్వరం గ్రామంలో ఈ హత్య జరిగింది. అధికార పార్టీ కార్యకర్త ఒకరు హత్యకు గురికావడం జిల్లాలో కలకలం రేపింది. కృష్ణారెడ్డి మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితులు చేజారిపోకుండా గ్రామంలో భారీగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. కృష్ణారెడ్డిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 
 
కృష్ణారెడ్డి పులిపాడు ప్రభుత్వ వైన్ షాపులో సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. ముసుగులు ధరించిన ఐదుగురు ప్రత్యర్థులు కళ్ళలో కారం చల్లి హత్య చేశారని స్థానికులు తెలిపారు. ఈ హత్యకు రాజకీయ కారణాలా లేక ఇతర కారణాలా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గురజాల మండలంలో ఉన్న జంగమహేశ్వరం గ్రామానికి ఫ్యాక్షన్ చరిత్ర ఉండటం గమనార్హం. మరోవైపు, టీడీపీ వాళ్లే ఈ హత్యకు చేయించారని వైకాపా శ్రేణులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments