Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న వైకాపా సామాజిక న్యాయభేరీ యాత్ర

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (16:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర ప్రశాంతంగా సాగుతోంది. ఈ చిత్రలో మంత్రులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నుంచి ఈ బస్సు యాత్ర మొదలైంది. 
 
ఇప్పటికే రాష్ట్రంలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకం రావడంతో వైకాపా నేతలు గ్రామాల్లో తిరగలేక తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల నుంచి చీవాట్లు తప్పించుకునేందుకు ఇపుడు బస్సు యాత్రను వైకాపా నేతలు చేపట్టారు. 
 
శ్రీకాకుళం నుంచి ఈ యాత్ర ప్రారంభిస్తారు. రాష్ట్ర మంత్రివర్గంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గానికి చెందిన మంత్రులు బస్సుల్లో రాష్ట్రమంతా పర్యటిస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి తదితర అంశాలను ప్రచారం చేస్తున్నారు. ఆ దిశగా ఈ బస్సు యాత్రకు రూపకల్పన చేశారు 
 
గురువారం ఉదయం తొలుత మంత్రుల బృందం శ్రీకాకుళంలోని ప్రసిద్ధ దేవాలయం అరసవల్లి ఆదిత్యుడ్ని దర్శించుకున్నారు. అనంతరం ఏడురోడ్ల జంక్షన్‌ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ తర్వాత బస్సులో బయల్దేరి ఇతర జిల్లాలకు యాత్ర ప్రారంభమైంది. మంత్రుల యాత్రను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో గట్టి భద్రతను కల్పించారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments