Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న వైకాపా సామాజిక న్యాయభేరీ యాత్ర

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (16:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర ప్రశాంతంగా సాగుతోంది. ఈ చిత్రలో మంత్రులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నుంచి ఈ బస్సు యాత్ర మొదలైంది. 
 
ఇప్పటికే రాష్ట్రంలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకం రావడంతో వైకాపా నేతలు గ్రామాల్లో తిరగలేక తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల నుంచి చీవాట్లు తప్పించుకునేందుకు ఇపుడు బస్సు యాత్రను వైకాపా నేతలు చేపట్టారు. 
 
శ్రీకాకుళం నుంచి ఈ యాత్ర ప్రారంభిస్తారు. రాష్ట్ర మంత్రివర్గంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గానికి చెందిన మంత్రులు బస్సుల్లో రాష్ట్రమంతా పర్యటిస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి తదితర అంశాలను ప్రచారం చేస్తున్నారు. ఆ దిశగా ఈ బస్సు యాత్రకు రూపకల్పన చేశారు 
 
గురువారం ఉదయం తొలుత మంత్రుల బృందం శ్రీకాకుళంలోని ప్రసిద్ధ దేవాలయం అరసవల్లి ఆదిత్యుడ్ని దర్శించుకున్నారు. అనంతరం ఏడురోడ్ల జంక్షన్‌ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ తర్వాత బస్సులో బయల్దేరి ఇతర జిల్లాలకు యాత్ర ప్రారంభమైంది. మంత్రుల యాత్రను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో గట్టి భద్రతను కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments