Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోడ్డు ప్రమాదాలు - మరణాల్లో ఏడో స్థానంలో ఆంధ్రప్రదేశ్

andhra pradesh map
, శుక్రవారం, 27 మే 2022 (10:40 IST)
రోడ్డు ప్రమాదాలు, మరణాల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా, గత ఐదేళ్ళకాలంలో ఏపీలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు సంభవించినట్టు కేంద్ర రహదారులు, రవాణా పరిశోధనా విభాగం "భారత్‌లో రోడ్డు ప్రమాదాలు-2020" అనే పేరుతో ఓ నివేదికను తయారు చేసింది. ఇందులో కీలక విషయాలను గణాంకాలతో సహా వివరించింది. 
 
ఈ నివేదిక ప్రకారం గత 2016-20 మధ్యకాలంలో రాష్ట్రంలో 1,16,591 ప్రమాదాలు జరుగగా, 39,180 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క 2020 సంపత్సరంలో 19,509 ప్రమాదాలు జరుగగా అందులో 7039 మంది చనిపోయారు. 
 
ఇకపోతే అతివేగం కారణంగా చనిపోయిన వారే ఎక్కువగా ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొది. 2020లో ఓవర్ స్పీడ్ వల్ల 5,227 మంది మృత్యువాతపడినట్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో 11.30 శాతం ఏపీలోనే సంభవించడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్లైట్‌ను ఆటో మోడ్‌లో పెట్టి కాక్‌పిట్‌లో ట్రైనీ పైలెట్‌తో శృంగారం