Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇద్దిరికీ లేఖలు రాసిన రఘురామరాజు... ఎందుకంటే...

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (11:27 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఫిషరీష్ వర్సిటీ ఏర్పాటు చేయాలని లేఖ కోరారు. భీమవరం ఆక్వా సంస్కృతికి రాజధాని అని రఘురామ గుర్తుచేశారు. 
 
అలాగే, ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌కు కూడా రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. జడ్జి రామకృష్ణను పీలేరు సబ్‌ జైలు నుంచి తిరుపతి ఆస్పత్రికి తరలించాలని కోరారు. 
 
రాజద్రోహం కేసు కారణంగా రామకృష్ణ రిమాండ్‌లో ఉన్నారని, మధుమేహం, అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రామకృష్ణకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. జడ్జి రామకృష్ణ కుటుంబసభ్యుల ఆవేదనను అర్థం చేసుకుని, జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను లేఖలో రఘురామకృష్ణరాజు కోరారు.
 
అంతకుముందు జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ... రఘురామకు ఫోన్‌ ద్వారా ఆయన ఆరోగ్య స్థితిగతుల గురించి వివరించారు. తన తండ్రికి మెరుగైన వైద్యం కోసం గవర్నర్‌కు లేఖ రాసి సహకరించాలని కోరారు. దీంతో ఆర్ఆర్ఆర్ గవర్నరుకు లేఖ రాశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments