రెండు బలహీన పార్టీలు కలవడం వల్ల మాకు నష్టం లేదు: వైకాపా ఎంపీ

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (11:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత బలహీనంగా ఉన్న రెండు పార్టీలు కలవడం వల్ల తమకు వచ్చే నష్టమేమీ లేదని అధికార వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. గురువారం విజయవాడలో భారతీయ జనతా పార్టీ - జనసేన పార్టీల అగ్రనేతల మధ్య సమన్వయ సమావేశం జరుగుతున్న విషయం తెల్సిందే. 
 
దీనిపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ, ఎక్కడైనా రెండు బలహీనమైన పార్టీలు బలపడాలని కోరుకుంటే పొత్తుతో ముందడుగు వేయాలనుకుంటాయని, రాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీలది అటువంటి ప్రయత్నమేనని చెప్పారు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కారణంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు.
 
పైగా, రెండు పార్టీల విధానాలేమిటో గురువారం సాయంత్రంలోగా తేలుతుందని, ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేయొచ్చన్నారు. ఏదిఏమైనా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వల్ల ఒనగూరే ఫలితం ఏమిటన్నది తేలాలంటే నాలుగున్నరేళ్లపాటు ఆగాలని రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. ఏది జరిగినా అత్యంత బలంగా తమ పార్టీకి జరిగే నష్టమేమీ లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments