Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు బలహీన పార్టీలు కలవడం వల్ల మాకు నష్టం లేదు: వైకాపా ఎంపీ

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (11:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత బలహీనంగా ఉన్న రెండు పార్టీలు కలవడం వల్ల తమకు వచ్చే నష్టమేమీ లేదని అధికార వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. గురువారం విజయవాడలో భారతీయ జనతా పార్టీ - జనసేన పార్టీల అగ్రనేతల మధ్య సమన్వయ సమావేశం జరుగుతున్న విషయం తెల్సిందే. 
 
దీనిపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ, ఎక్కడైనా రెండు బలహీనమైన పార్టీలు బలపడాలని కోరుకుంటే పొత్తుతో ముందడుగు వేయాలనుకుంటాయని, రాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీలది అటువంటి ప్రయత్నమేనని చెప్పారు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కారణంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు.
 
పైగా, రెండు పార్టీల విధానాలేమిటో గురువారం సాయంత్రంలోగా తేలుతుందని, ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేయొచ్చన్నారు. ఏదిఏమైనా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వల్ల ఒనగూరే ఫలితం ఏమిటన్నది తేలాలంటే నాలుగున్నరేళ్లపాటు ఆగాలని రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. ఏది జరిగినా అత్యంత బలంగా తమ పార్టీకి జరిగే నష్టమేమీ లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి సినిమాకు హోంవర్క్ చేస్తున్నా, నాగార్జునతో హలో బ్రదర్ లాంటి సినిమా చేస్తా : అనిల్ రావిపూడి

ఐటీ సోదాలు సహజమే... ఇవేమీ కొత్తకాదు : దిల్ రాజు

Tamannaah: తమన్నాను ఆంటీ అని పిలిచిన రవీనా టాండన్ కుమార్తె.. ఏమైందంటే?

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా రాబోతున్నాఅంటున్న నాగశౌర్య

'పుష్ప-2' రికార్డులన్నీ ఫేకా? లెక్కల నిగ్గు తేలుస్తున్న ఐటీ అధికారులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

తర్వాతి కథనం
Show comments