Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరసాపురం ఎంపీ సంగతి తేల్చేద్ధాం : ప్రత్యేక విమానంలో హస్తినకు వైకాపా ఎంపీలు

Webdunia
గురువారం, 2 జులై 2020 (16:53 IST)
పార్టీలో రెబెల్ ఎంపీగా ఉన్న నరసాపురం లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజు సంగతి అటో ఇటో తేల్చాలన్న పట్టుదలతో వైకాపా నేతలు ఉన్నారు. ఇందుకోసం ఆ పార్టీకి చెందిన ఎంపీలు ప్రత్యేక విమానంలో శుక్రవారం హస్తినకు వెళ్లనున్నారు. వీరంతా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమై, నరసాపురం ఎంపీ గురించి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా, పార్టీ ధిక్కరణ చర్యల కింద ఆయనపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేయనున్నారు. 
 
రఘురామకృష్ణంరాజుకు పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో విజయసాయిరెడ్డి ఇప్పటికే షోకాజ్ నోటీసులు కూడా పంపించారు. వీటికి సంజాయిషీ ఇవ్వకపోగా, ఆ షోకాజ్ నోటీసులనే ప్రశ్నించడం ద్వారా రఘురామకృష్ణరాజు మరింత ఆజ్యం పోశారు. వైసీపీ హైకమాండ్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. 
 
పార్టీకి దూరం కావాలన్న ఉద్దేశంతోనే రఘురామకృష్ణరాజు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్నది వైసీపీ నేతల ఆరోపణ. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన నరసాపురం ఎంపీ ఇప్పటికే ఢిల్లీ వెళ్లి స్పీకర్‌ను, పలువురు కేంద్ర మంత్రులను కలిసి తన వాదనలు వినిపించారు. రేపు వైసీపీ ఎంపీలు కూడా స్పీకర్‌ను కలవనుండడంతో ఈ అంశంలో మరింత ఆసక్తి ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manoj: మ్యాజికల్ స్టిక్ తో తేజ సజ్జా, బ్లాక్ స్వోర్డ్ తో మనోజ్ ల మిరాయ్ పోరాటం

Raviteja: మాస్ జాతర ఆలస్యమైనా అసలైన పండుగను సిద్ధమంటూ నిర్మాతలు ప్రకటన

Sivakarthikeyan : మానసిక స్థితి కలిగిన వ్యక్తిగా శివకార్తికేయన్ మదరాసి

OG: పవన్ కళ్యాణ్ పుట్టినరోజున దే కాల్ హిమ్ ఓజీ. నుంచి కొత్త అప్ డేట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments