Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పార్టీని - పార్టీ అధినేతను పల్లెత్తు మాట అనలేదు.. : వైకాపా ఎంపీ

పార్టీని - పార్టీ అధినేతను పల్లెత్తు మాట అనలేదు.. : వైకాపా ఎంపీ
, బుధవారం, 24 జూన్ 2020 (19:36 IST)
వైకాపా అధిష్టానం పంపిన షోకాజ్ నోటీసుపై వెస్ట్ గోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ సభ్యుడు, వైకాపా నేత రఘురామకృష్ణంరాజు స్పందించారు. షోకాజ్ నోటీసు తనకు అందిందని చెప్పారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఈ నోటీసులు పంపించారని తెలిపారు. అయితే, తాను పార్టీని లేదా పార్టీ అధినేతను మాత్రం పల్లెత్తు మాట అనలేదని గుర్తుచేశారు. 
 
పార్టీకి, పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పది రోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నోటీసులో పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడారని, పార్టీ ఎమ్మెల్యేలను కించపరుస్తూ వ్యాఖ్యానించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. వారంలో రోజుల్లో నోటీసుకు సమాధానం ఇవ్వాలని... లేని పక్షంలో క్రమశిక్షణా చర్యలను తీసుకుంటామని నోటీసులో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
 
ఈ నోటీసులపై రఘురామకృష్ణంరాజు స్పందించారు. తనకు నోటీసులు అందాయని ఆయన తెలిపారు. తాను ఏనాడూ పార్టీని కానీ, పార్టీ అధినేతను కానీ చిన్న మాట కూడా అనలేదని చెప్పారు. ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు సరిగా అమలు కావడం లేదనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నానని... అయితే, ఆయన అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో మీడియా ముఖంగా చెప్పానని ఆయన అన్నారు. పైగా, తాను చెప్పదలచుకున్న విషయాలు మీడియా ద్వారానే చెప్పినట్టు, ఇక కొత్తగా చెప్పేది ఏమీ లేదన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా కరతాళనృత్యం.. తమిళనాడులో ఒకేరోజు 2,865 కేసులు 33మంది మృతి