Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నరసాపురం ఎంపీకి వైకాపా షోకాజ్ నోటీసు!?

నరసాపురం ఎంపీకి వైకాపా షోకాజ్ నోటీసు!?
, బుధవారం, 24 జూన్ 2020 (13:53 IST)
అధికార వైకాపాకు చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు జారీచేసింది. ఆయన పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
ఆంగ్ల మాధ్యమం విషయంలో పార్టీ మేనిఫెస్టోకు భిన్నంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. అలాగే, వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఆయన ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు గుప్పించారని పేర్కొన్నారు. 
 
బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో వుంటూ సొంత పార్టీని కించపర్చేలా వ్యాఖ్యలు చేయడమే కాకుండా సీఎం జగన్‌పై కూడా పలు వ్యాఖ్యలు చేశారని  పేర్కొన్నారు. 
 
అలాగే, పలు సందర్భాలలో ఆయన మీడియా ముందు పార్టీ, ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేశారని తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలన్నింటికీ వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంటూ ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు వైసీపీ అధిష్టానం పేర్కొంది. 
 
కాగా, ఇటీవల సీఎం జగన్ యేడాది పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, రాష్ట్రంలో ఇసుక దోపిడీ పెరిగిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలోనే చర్చనీయాంశంగా మారాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగస్టు వరకు రైళ్ల రాకపోకలు లేనట్టే.. రీఫండ్ చేయనున్న రైల్వేశాఖ