వైకాపా ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (09:18 IST)
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన వైకాపా ఎమ్మల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నమూశారు. కాలేయ, ఊపిరితిత్తుల సమస్య, దగ్గుతూ బాధపడుతూ వచ్చిన ఆయన్ను హైదరాబాద్ నగరంలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తూ వచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 46 యేళ్లకే ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆయన కుటుంబం బోరున విలపిస్తుంది. వైకాపా శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. 
 
ఈయన అంత్యక్రియలు గురువారం జరుగనున్నాయి. ఈయన దివంగత చల్లా రామకృష్ణా రెడ్డి కుమారుడు. ఎమ్మెల్సీగా ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి మరణించడంతో చల్లా భగీరథ రెడ్డికి ఆ టిక్కెట్ ఇచ్చారు. ఈయన తొలుత కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పని చేసారు. 2019 తండ్రి మరణంతో వైకాపాలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తండ్రి మరణానంతరం ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

ప్రియదర్శి, ఆనంది ల ఫన్ రొమాన్స్ చిత్రం ప్రేమంటే

విశాల్... మకుటం’ చిత్రానికి గ్రాండ్ క్లైమాక్స్ షూట్ పూర్తి

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments