Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిఎం రమేష్ ఎనర్జీ టాబ్లెట్లు వేసుకుంటున్నారు... రోజా సంచలన వ్యాఖ్యలు

మరోసారి తెలుగుదేశంపార్టీపై విరుచుకుపడ్డారు వైసిపి ఎమ్మెల్యే రోజా. కడప ఉక్కు - ఆంధ్రుల హక్కు పేరుతో తెలుగుదేశం చేస్తున్న దీక్ష అంతా బూటకమని కొట్టి పారేశారు రోజా. తొమ్మిది రోజులు కాదు సంవత్సరం పాటు ఎంపి సి.ఎం. రమేష్‌ దీక్ష చేసినా ఏమీ కాదని, ఆయన చనిపోయే

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (16:59 IST)
మరోసారి తెలుగుదేశంపార్టీపై విరుచుకుపడ్డారు వైసిపి ఎమ్మెల్యే రోజా. కడప ఉక్కు - ఆంధ్రుల హక్కు పేరుతో తెలుగుదేశం చేస్తున్న దీక్ష అంతా బూటకమని కొట్టి పారేశారు రోజా. తొమ్మిది రోజులు కాదు సంవత్సరం పాటు ఎంపి సి.ఎం. రమేష్‌ దీక్ష చేసినా ఏమీ కాదని, ఆయన చనిపోయే అవకాశమే లేదన్నారు రోజా. విదేశాల నుంచి వేల రూపాయలు వెచ్చించి ఎనర్జీ ట్యాబ్లెట్లను సిఎం రమేష్‌ కొనుక్కుని వచ్చి వేసుకుంటున్నాడని అన్నారు. 
 
రాత్రయితే ఆ ట్యాబ్లెట్లు వేసుకుని పడుకుంటున్నాడని, సిఎం... రమేష్‌ అనారోగ్యం క్షీణిస్తోందని జరుగుతున్న ప్రచారంలో అసలు నిజమే లేదన్నారు రోజా. తొమ్మిదిరోజుల పాటు దీక్ష చేస్తే మనిషి పూర్తిగా నీరసించిపోతాడని, కానీ సి.ఎం.రమేష్‌ విషయంలో మాత్రం అలా జరగలేదని చెప్పారామె.
 
కేంద్రంపై పోరాడేందుకు అందరినీ కలుపుకుని పోవాలే తప్ప, ప్రజలను మభ్యపెట్టేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసాగిస్తుందన్నారు ఎమ్మెల్యే రోజా.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments