Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిఎం రమేష్ ఎనర్జీ టాబ్లెట్లు వేసుకుంటున్నారు... రోజా సంచలన వ్యాఖ్యలు

మరోసారి తెలుగుదేశంపార్టీపై విరుచుకుపడ్డారు వైసిపి ఎమ్మెల్యే రోజా. కడప ఉక్కు - ఆంధ్రుల హక్కు పేరుతో తెలుగుదేశం చేస్తున్న దీక్ష అంతా బూటకమని కొట్టి పారేశారు రోజా. తొమ్మిది రోజులు కాదు సంవత్సరం పాటు ఎంపి సి.ఎం. రమేష్‌ దీక్ష చేసినా ఏమీ కాదని, ఆయన చనిపోయే

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (16:59 IST)
మరోసారి తెలుగుదేశంపార్టీపై విరుచుకుపడ్డారు వైసిపి ఎమ్మెల్యే రోజా. కడప ఉక్కు - ఆంధ్రుల హక్కు పేరుతో తెలుగుదేశం చేస్తున్న దీక్ష అంతా బూటకమని కొట్టి పారేశారు రోజా. తొమ్మిది రోజులు కాదు సంవత్సరం పాటు ఎంపి సి.ఎం. రమేష్‌ దీక్ష చేసినా ఏమీ కాదని, ఆయన చనిపోయే అవకాశమే లేదన్నారు రోజా. విదేశాల నుంచి వేల రూపాయలు వెచ్చించి ఎనర్జీ ట్యాబ్లెట్లను సిఎం రమేష్‌ కొనుక్కుని వచ్చి వేసుకుంటున్నాడని అన్నారు. 
 
రాత్రయితే ఆ ట్యాబ్లెట్లు వేసుకుని పడుకుంటున్నాడని, సిఎం... రమేష్‌ అనారోగ్యం క్షీణిస్తోందని జరుగుతున్న ప్రచారంలో అసలు నిజమే లేదన్నారు రోజా. తొమ్మిదిరోజుల పాటు దీక్ష చేస్తే మనిషి పూర్తిగా నీరసించిపోతాడని, కానీ సి.ఎం.రమేష్‌ విషయంలో మాత్రం అలా జరగలేదని చెప్పారామె.
 
కేంద్రంపై పోరాడేందుకు అందరినీ కలుపుకుని పోవాలే తప్ప, ప్రజలను మభ్యపెట్టేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసాగిస్తుందన్నారు ఎమ్మెల్యే రోజా.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments