Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ నేత కంటు పాపారావు మృతి

Webdunia
సోమవారం, 22 జులై 2019 (17:15 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త కంటు పాపరావు(64) సోమవారం గుండెపోటుతో మరణించారు. పాతబస్తీ శివాలయం వీధిలోని షణ్ముఖ గోల్డ్ అండ్ సిల్వర్ ప్యాలెస్ అధినేతగా సుప్రసిద్ధుడైన పాపారావు, ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం విశేషంగా కృషి చేశారు. 
 
వ్యాపారవేత్తగా రాణిస్తూనే రాజకీయ, సేవారంగాలలో ఆయన ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. పలు సేవా కార్యక్రమాల ద్వారా వివిధ వర్గాల ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న పాపారావు మరణం తమను ఎంతగానో కలచివేసిందని బులియన్ వ్యాపారుల సంఘం నేతలు పేర్కొన్నారు. 
 
వ్యాపార వర్గాల్లో తనకున్న విశేష పరిచయాలతో వైసీపీ విజయానికి కృషి చేసిన పాపారావు మృతి పట్ల ఆ పార్టీ నేతలు విచారం వ్యక్తంచేశారు. పాపారావు మృతి తమ పార్టీకి తీరనిలోటని వారు సంతాపం వెలిబుచ్చారు. కంటు పాపారావుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మంగళవారం ఉదయం పాపారావు అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన పెద్ద కుమారుడు కంటు మహేష్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments