వైసీపీ నేత కంటు పాపారావు మృతి

Webdunia
సోమవారం, 22 జులై 2019 (17:15 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త కంటు పాపరావు(64) సోమవారం గుండెపోటుతో మరణించారు. పాతబస్తీ శివాలయం వీధిలోని షణ్ముఖ గోల్డ్ అండ్ సిల్వర్ ప్యాలెస్ అధినేతగా సుప్రసిద్ధుడైన పాపారావు, ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం విశేషంగా కృషి చేశారు. 
 
వ్యాపారవేత్తగా రాణిస్తూనే రాజకీయ, సేవారంగాలలో ఆయన ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. పలు సేవా కార్యక్రమాల ద్వారా వివిధ వర్గాల ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న పాపారావు మరణం తమను ఎంతగానో కలచివేసిందని బులియన్ వ్యాపారుల సంఘం నేతలు పేర్కొన్నారు. 
 
వ్యాపార వర్గాల్లో తనకున్న విశేష పరిచయాలతో వైసీపీ విజయానికి కృషి చేసిన పాపారావు మృతి పట్ల ఆ పార్టీ నేతలు విచారం వ్యక్తంచేశారు. పాపారావు మృతి తమ పార్టీకి తీరనిలోటని వారు సంతాపం వెలిబుచ్చారు. కంటు పాపారావుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మంగళవారం ఉదయం పాపారావు అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన పెద్ద కుమారుడు కంటు మహేష్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments