Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ నేత కంటు పాపారావు మృతి

Webdunia
సోమవారం, 22 జులై 2019 (17:15 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త కంటు పాపరావు(64) సోమవారం గుండెపోటుతో మరణించారు. పాతబస్తీ శివాలయం వీధిలోని షణ్ముఖ గోల్డ్ అండ్ సిల్వర్ ప్యాలెస్ అధినేతగా సుప్రసిద్ధుడైన పాపారావు, ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం విశేషంగా కృషి చేశారు. 
 
వ్యాపారవేత్తగా రాణిస్తూనే రాజకీయ, సేవారంగాలలో ఆయన ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. పలు సేవా కార్యక్రమాల ద్వారా వివిధ వర్గాల ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న పాపారావు మరణం తమను ఎంతగానో కలచివేసిందని బులియన్ వ్యాపారుల సంఘం నేతలు పేర్కొన్నారు. 
 
వ్యాపార వర్గాల్లో తనకున్న విశేష పరిచయాలతో వైసీపీ విజయానికి కృషి చేసిన పాపారావు మృతి పట్ల ఆ పార్టీ నేతలు విచారం వ్యక్తంచేశారు. పాపారావు మృతి తమ పార్టీకి తీరనిలోటని వారు సంతాపం వెలిబుచ్చారు. కంటు పాపారావుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మంగళవారం ఉదయం పాపారావు అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన పెద్ద కుమారుడు కంటు మహేష్ తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments