Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం... బీసీ, ఎస్సీ, ఎస్టీల‌కు అవ‌కాశం

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (11:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌లో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏ మండలంలో అయినా జెడ్పీటీసీ, ఎంపీపీ రెండూ స్థానాలు అన్-రిజర్వుడ్ అయితే, ఒక స్థానాన్ని బిసి, ఎస్సీ, ఎస్టీల‌కు  కేటాయించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల భర్తీలో 50% బిసి,ఎస్సి,ఎస్టీలకు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇపుడు అద‌నంగా జెడ్పీటీసీ, ఎంపీల‌లో ఓ స్థానాన్ని బిసీ, ఎస్సీ ఎస్టీల‌కు ఇవ్వాలని స్వయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  పార్టీ పెద్దలకు, ఎమ్మెల్యేలకు సూచించారు.
 
ఇప్పటికే  అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్రంలో చాలా జెడ్సీటీసీ స్థానాల‌లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నెల 25న  ఎంపీపీని ఎన్నుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఏకగ్రీవం అయిన జెడ్పీటీసీ  స్థానాన్ని ఇపుడు మార్చేందుకు వీలులేదు. ఎంపీపీ అభ్యర్థిని మార్చేందుకు ఆస్కారం ఉంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయంతో ఏ మండలంలో జెడ్పీటీసీ, ఎంపీపీ రెండూ అన్-రిజెర్వుడ్ ఉన్న చోట్ల ఎంపీపీని  బిసి,ఎస్సి,ఎస్టీలకు కట్టబెట్టబోతోంది వైసిపి.
 
ఈ నిర్ణయం పట్ల పలువురు ఎస్సి, ఎస్టీ, బిసి సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ, హర్షం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న చారిత్మక నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఎంపీపీ, జెడ్పిటిసి రెండు అన్-రిజర్వయిడ్ అయిన‌ మండలాలలో ఎంపిపి పదవిని బిసి,యస్సి,ఎస్టీ వర్గాల వారికి కట్టబెట్టాలని పార్టీ అధినేత గట్టిగా ఆదేశాలు జారీ చేసారు. రాష్ట్రంలోని అందరూ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ విధానాన్ని పాటించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెంగ్త్ వీడియో ప్లీజ్... “నెక్స్ట్ టైమ్ బ్రో” అంటూ నటి ఓవియా రిప్లై

రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన జూనియర్ ఎన్టీఆర్ "దేవర"

ఘనంగా నారా రోహిత్ - సిరి లేళ్ల నిశ్చితార్థం.. హాజరైన సీఎం బాబు దంపతులు

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో నాల్గవ చిత్రం ప్రకటన

చైతన్య రావు, హెబ్బా పటేల్ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ఆహాలో ఆదరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం-సంబంధిత దృష్టి నష్టాన్ని నివారించే లక్ష్యంతో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే?

పోషకాల గని సీతాఫలం తింటే ఈ వ్యాధులన్నీ దూరం

అక్టోబరు 11 ప్రపంచ బిర్యానీ దినోత్సవం - భారత్‌కు బిర్యానీ పరిచయం చేసింది ఎవరు?

తేనెలో ఊరబెట్టిన ఉసిరి కాయలు తింటే కలిగే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments