Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెచ్చిపోయిన వైకాపా ఎమ్మెల్యే కంగాటి అనుచరులు - టోల్ ప్లాజా ధ్వంసం

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (13:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా పార్టీ నేతలు, వారి అనుచరగణం అధికారమదంతో రెచ్చిపోతున్నారు. తమకు అడ్డుతగిలేవారిని, వ్యతిరేకించేవారిని, తమ మాటకు అడ్డు చెప్పేవారిపై దాడి చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా అమకతాడు టోల్‌ప్లాజపై వైకాపా కార్యకర్తలు తమ ప్రతాపం చూపించారు. 
 
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచరులు ఈ టోల్‌ప్లాజాను ధ్వంసం చేశారు. ఆ తర్వాత వీరంగం సృష్టించారు. తమ వాహనానికే అనుమతి ఇవ్వరా అంటూ టోల్‌ప్లాజాను ధ్వంసం చేసి సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. దీంతో ప్రాణభయంతో టోల్‌ప్లాజా సిబ్బంది పరుగులు తీశారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 
ఎమ్మెల్యే శ్రీదేవి జిల్లాలోని తుగ్గలి మండలం పర్యటనను ముగించుకుని డోవ్ జాతీయ రహదారి మీదుగా కర్నూలుకు బయలుదేరారు. అమకతాడు టోల్‌ప్లాజా వద్ద సిబ్బంది ఎమ్మెల్యే వాహనానికి అనుమతి ఇచ్చారు. కానీ, ఎమ్మెల్యే అనుచరులు వచ్చిన వాహనాలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో వారంతా ఒక్కసారిగా రెచ్చిపోయారు. 
 
తమ వాహనాన్నే అడ్డుకుంటారా? అంటూ దుర్భాషలాడుతూ కర్రలతో టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. ఈ దాడి ఫుటేజీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే... ఈ దాడి ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని కృష్ణగిరి ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments