Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెచ్చిపోయిన వైకాపా ఎమ్మెల్యే కంగాటి అనుచరులు - టోల్ ప్లాజా ధ్వంసం

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (13:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా పార్టీ నేతలు, వారి అనుచరగణం అధికారమదంతో రెచ్చిపోతున్నారు. తమకు అడ్డుతగిలేవారిని, వ్యతిరేకించేవారిని, తమ మాటకు అడ్డు చెప్పేవారిపై దాడి చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా అమకతాడు టోల్‌ప్లాజపై వైకాపా కార్యకర్తలు తమ ప్రతాపం చూపించారు. 
 
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచరులు ఈ టోల్‌ప్లాజాను ధ్వంసం చేశారు. ఆ తర్వాత వీరంగం సృష్టించారు. తమ వాహనానికే అనుమతి ఇవ్వరా అంటూ టోల్‌ప్లాజాను ధ్వంసం చేసి సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. దీంతో ప్రాణభయంతో టోల్‌ప్లాజా సిబ్బంది పరుగులు తీశారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 
ఎమ్మెల్యే శ్రీదేవి జిల్లాలోని తుగ్గలి మండలం పర్యటనను ముగించుకుని డోవ్ జాతీయ రహదారి మీదుగా కర్నూలుకు బయలుదేరారు. అమకతాడు టోల్‌ప్లాజా వద్ద సిబ్బంది ఎమ్మెల్యే వాహనానికి అనుమతి ఇచ్చారు. కానీ, ఎమ్మెల్యే అనుచరులు వచ్చిన వాహనాలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో వారంతా ఒక్కసారిగా రెచ్చిపోయారు. 
 
తమ వాహనాన్నే అడ్డుకుంటారా? అంటూ దుర్భాషలాడుతూ కర్రలతో టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. ఈ దాడి ఫుటేజీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే... ఈ దాడి ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని కృష్ణగిరి ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments