Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ ఆకస్మిక హస్తిన టూర్ - రేపు ప్రధానితో భేటీ

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (12:45 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. అదే రోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆయన సమావేశంకానున్నారు. సీఎం జగన్‌కు పీఎంవో వర్గాలు అపాయింట్మెంట్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. 
 
అయితే, సీఎం జగన్ చేపట్టి హస్తిన పర్యటన, ప్రధాని మోడీతో జరిగే సమావేశంలో ఏయే అంశాలు చర్చకు వస్తాయన్న అంశంపై ఇప్పటివరకు ఓ క్లారిటీ లేదు. ముఖ్యంగా, వైకాపా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి, ఏప్రిల్ 4 నుంచి ఆ జిల్లాల్లో పాలన కూడా ప్రారంభమైంది. 
 
ఈ విషయాన్ని ప్రధాని మోడీకి వివరించి, రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరితగతిన విడుదల చేయాల్సిందిగా కోరే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. తమ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల కోసం కనీసం అప్పుల రూపంలో అయినా నిధులు ఇప్పించేలా సహకరించాలని ప్రధాని మోడీని కోరే అవకాశం ఉంది. అలాగే, అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మరోమారు ప్రధానిని సీఎం జగన్ కోరనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments