Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొడగొట్టి చెబుతున్నా... 2024లో ఎంపీ సీట్లన్నీ మావే : విజయసాయిరెడ్డి

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (15:11 IST)
వచ్చే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ సీట్లు, 25 సీట్లను గెలుచుకుంటామని రాజ్యసభలో వైకాపా నేత విజయసాయి రెడ్డి జోస్యం చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ 25 ఎంపీ సీట్లకు గాను ఏకంగా 22 సీట్లను కైవసం చేసుకోవడం ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఘనవిజయానికి నిదర్శమన్నారు. ఇపుడు తొడగొట్టి చెబుతున్నాం... వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో 25కు 25 లోక్‌సభ సీట్లను గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
 
అదేసమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజన్న పాలన ప్రారంభమైందనీ, సీఎం జగన్ అవినీతిరహిత పాలన అందిస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రజారంజక పాలన అందించేలా జగన్ నిర్ణయాలు ఉండబోతున్నాయన్నారు. జగన్ ఆలోచనలకు అనుగుణంగా పార్లమెంటులో వైసీపీ సభ్యులు నడుచుకుంటారని ఆయన తెలిపారు.
 
కాగా, ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో 175 అసెంబ్లీ సీట్లకు గాను వైకాపా 151 శాసనసభ సీట్లను, 25 ఎంపీ సీట్లకు గాను 22 ఎంపీ సీట్లను గెలుచుకున్న అఖండ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments