మూకుమ్మడి రాజీనామాల దిశగా వైకాపా ... జగన్ నిర్ణయం

విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఇప్పటికే వైకాపాకు చెందిన లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేశారు. అలాగే, ఎమ్మెల్యేలతో కూడా రాజీనామాలు చేయించాలని ఆ పార్టీ అధిన

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (10:57 IST)
విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఇప్పటికే వైకాపాకు చెందిన లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేశారు. అలాగే, ఎమ్మెల్యేలతో కూడా రాజీనామాలు చేయించాలని ఆ పార్టీ అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇదే విషయాన్ని ఆయన పార్టీలోని సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలకు తెలిపినట్టు సమాచారం.
 
ఆదివారం పాదయాత్ర ముగించాక... కృష్ణా జిల్లా అగిరిపల్లిలో పార్టీ ఎంపీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో జగన్‌ సమావేశమయ్యారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు... పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశం చివరి రోజున వైసీపీ లోక్‌సభ సభ్యులు తమ సభ్యత్వాలకు రాజీనామా చేయడం.. అనంతరం ఢిల్లీలో ఆమరణ దీక్షకు దిగడంతో నాలుగేళ్ల నుంచి హోదా కోసం చేస్తున్న పోరాటానికి ఊతమిచ్చిందని జగన్‌ పేర్కొన్నారు. 
 
ఫలితంగా గతంలో స్పెషల్‌ ప్యాకేజీకి ఆమోదించి.. కేంద్ర అర్థికమంత్రి అరుణ్‌జైట్లీని సన్మానించిన చంద్రబాబును.. యూటర్న్‌ తీసుకునేలా చేసిందని అన్నారు. లోక్‌సభ సభ్యులు రాజీనామాలు సమర్పించి.. ఆమరణ దీక్షను చేపట్టాక వైసీపీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగిందని ఒక ముఖ్యనేత ప్రస్తావించారు. ఇదే తరహాలో ఎమ్మెల్యేలూ రాజీనామాలు సమర్పిస్తే.. ప్రత్యేక హోదా ఉద్యమం హోరెత్తుతుందని వివరించారు. ఎమ్మెల్యేల రాజీనామాల అంశం పెద్ద విషయమేమీ కాదని, వ్యూహాలను దశల వారీగా ప్రకటించాల్సి ఉంటుందని జగన్‌ చెప్పారు. తనతో సహా ఎమ్మెల్యేలమంతా సరైన సమయంలో రాజీనామాలు చేస్తామని వారితో వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments