పవన్ను సీఎం చంద్రబాబు పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు: రోజా
తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ శ్రీరెడ్డి పుణ్యమాని వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం టాలీవుడ్ను ఓ కుదుపు కుదిపేసింది. ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ను తరిమికొట్టే ప్రయత్నంలో బాధితుల
Publish Date: Sun, 22 Apr 2018 (10:17 IST)
Updated Date: Sun, 22 Apr 2018 (10:48 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ శ్రీరెడ్డి పుణ్యమాని వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం టాలీవుడ్ను ఓ కుదుపు కుదిపేసింది. ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ను తరిమికొట్టే ప్రయత్నంలో బాధితులకు అండగా ఉంటామని సినీనటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు.
1991 నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నానని.. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాస్టింగ్ కౌచ్పై ఎవరూ ఫిర్యాదు చేయలేదని.. ఇకపై ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చునని తెలిత్తినా నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.
పబ్లిసిటీ కోసం ఎవరైనా సరే ఇండస్ట్రీ పరువు తీయాలనుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయకూడదని తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ను సీఎం చంద్రబాబు పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సినీ పరిశ్రమ కూడా పోరాడుతుందన్నారు.
మరోవైపు క్యాస్టింగ్ కౌచ్ గురించి హీరోయిన్ ఆదాశర్మ తెలిపింది. సెక్సువల్ ఫేవర్ చేయాలా? వద్దా? అనేది పూర్తిగా వ్యక్తిగతమైన అంశమని తెలిపింది. పని కోసం శారీరక సుఖం ఇవ్వడానికి కొందరు వెనుకాడటం లేదని స్పష్టం చేసింది. ఇది కేవలం సినిమా రంగానికే పరిమితం కాదని... ఎన్నో చోట్ల ఇది కొనసాగుతోందని తెలిపింది.
కాకపోతే, మహిళలను లైంగికంగా ఒత్తిడి చేయడం మాత్రం తప్పు అని చెప్పింది. తనకు ఇలాంటి అనుభవం ఎదురుకాలేదని తెలిపింది. బాలీవుడ్తో పోల్చితే దక్షిణాదిలో సినిమా ఛాన్సులు దక్కించుకోవడం ఈజీ అని ఆదాశర్మ వెల్లడించింది.
selvi
Publish Date: Sun, 22 Apr 2018 (10:17 IST)
Updated Date: Sun, 22 Apr 2018 (10:48 IST)