Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మతోడు... నేను మాటమీద నిలబడనంటే నిలబడను.. ఆర్జీవీ

వివాదాలకు కేరాఫ్ చిరునామాగా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు రెచ్చిపోయారు. తన తల్లిమీద వేసిన ఒట్టును సైతం పక్కనబెట్టేశాడు. పైగా, తాను మాటమీద నిలబడే వ్యక్తిని కాదని మరోమారు తన చేతల ద్వారా నిరూపించ

అమ్మతోడు... నేను మాటమీద నిలబడనంటే నిలబడను.. ఆర్జీవీ
, శనివారం, 21 ఏప్రియల్ 2018 (11:53 IST)
వివాదాలకు కేరాఫ్ చిరునామాగా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు రెచ్చిపోయారు. తన తల్లిమీద వేసిన ఒట్టును సైతం పక్కనబెట్టేశాడు. పైగా, తాను మాటమీద నిలబడే వ్యక్తిని కాదని మరోమారు తన చేతల ద్వారా నిరూపించారు.
 
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, శ్రీరెడ్డి ఎపిసోడ్‌ వ్యవహారంపై ఆర్జీవీ శనివారం మరోమారు స్పందించరు. పవన్ విషయంలో తాను చేసింది నూటికి నూరు శాతం క్షమించరాని తప్పు అని చెప్పారు. మళ్లీ ఇంకొకసారి అల్లు అరవింద్‌కు, పవన్ కళ్యాణ్‌కి, మెగా కుటుంబ సభ్యులకీ, ఫాన్స్‌కీ అందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నానన్నారు. పైగా, మళ్లీ ఎప్పుడూ పవన్ మీద కానీ, మిగతా ఫ్యామిలీ మెంబెర్స్ మీద కానీ నెగిటివ్ కామెంట్స్ పెట్టనని తన తల్లి మీద, తన వృత్తి మీద ఒట్టేసి చెబుతున్నానన్నారు. గతంలో తాను ఒట్లు నిలబెట్టుకోకపోయుండచ్చు కానీ, తన తల్లి మీద తానెప్పుడూ ఒట్టేయ్యలేదన్నారు.
 
అయితే, తాజాగా ఆ ఒట్టుతీసి గట్టున పెట్టేశారు. దానికి కారణం కూడా వర్మ వివరించారు. 'నేను చేసిన పనికి సారీ చెప్పి పీకే మీద ఇక కామెంట్ చెయ్యనని మా అమ్మ మీద ఒట్టు వేశాను. ఆ తర్వాత కూడా నేను చంద్రబాబు, లోకేష్, శ్రీని రాజు, ఆర్కే, రవిప్రకాష్, మూర్తి కూటమిలో ఉన్నానని ఆరోపించడం మూలాన మా అమ్మ అంగీకారంతో ఇప్పుడు నా ఒట్టు తీసి గట్టు మీద పెట్టాను'. ఇకపై యధావిధిగా విమర్శలు గుప్పిస్తాను అంటూ తన చేతల ద్వారా చెప్పకనే చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'భరత్ అనే నేను'.. రోజువారీ లెక్కలు తిరగరాస్తున్నా...