Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'భరత్ అనే నేను'.. రోజువారీ లెక్కలు తిరగరాస్తున్నా...

ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ ద‌క్కించు

Advertiesment
Bharat Ane Nenu
, శనివారం, 21 ఏప్రియల్ 2018 (11:39 IST)
ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ ద‌క్కించుకుంది. 
 
ప్ర‌స్తుతం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ళ ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది. మొన్న‌టి వ‌ర‌కు "రంగ‌స్థ‌లం" చిత్రంపై ఉన్న రికార్డులని తుడిపేస్తుంది. చ‌ర‌ణ్ న‌టించిన 'రంగ‌స్థ‌లం' చిత్రం తొలి రోజున త‌మిళ‌నాడులో రూ.25 ల‌క్ష‌ల గ్రాస్‌ని క‌లెక్ట్ చేయ‌గా, 'భ‌ర‌త్ అనే నేను' రూ.27 ల‌క్ష‌లకి పైగా గ్రాస్ వ‌సూలు చేసి స‌రికొత్త రికార్డు సృష్టించింది. నిజానికి మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'స్పైడ‌ర్' చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. ఈ చిత్రంతో మ‌హేష్‌కి త‌మిళ రాష్ట్రాల‌లోను ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
 
ఈ క్ర‌మంలో అక్క‌డ మ‌రిన్ని వ‌సూళ్ళు రాబ‌ట్టొచ్చని స‌మాచారం. ఇక ఆస్ట్రేలియాలోనూ 'భ‌ర‌త్ అనే నేను' మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంటలు మండిస్తుంది. అక్క‌డ 35 ప్రాంతాల‌లో ఈ చిత్రం విడుద‌ల కాగా తొలి రోజు 168,194 డాల‌ర్లు (85.45ల‌క్ష‌ల) వ‌సూళ్ళు సాధించి మ‌హేష్ స్టామినా ఏంట‌నేది నిరూపించింది. రానున్న రోజుల‌లో ఈ చిత్రం మరిన్ని రికార్డులు కొల్ట‌గొట్ట‌డం ఖాయమని ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలీవుడ్ యువ హీరో తండ్రికి మూడేళ్ళ జైలు.. ఎందుకంటే?