Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ కుటుంబ వ్యాపారాలకు జగన్ ఒక గార్డియన్ మాత్రమే.. వైఎస్ షర్మిల

ఠాగూర్
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (15:39 IST)
తన అన్న, వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోమారు ఎండగట్టారు. ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్ కుటుంబ వ్యాపారాలకు జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక గార్డియన్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం మూడు పేజీలతో కూడిన ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. వైఎస్ ఉన్నపుడు స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలేనని తేల్చి చెప్పారు. తన తండ్రి వైఎస్ స్థాపించిన వ్యాపారాలు జగన్ సొంతం కాదన్నారు. ఈ రోజువరకు తనకు న్యాయంగా రావాల్సిన ఒక్క  ఆస్తి కూడా తన చేతుల్లో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ బతికివున్నపుడే ఆస్తుల పంపిణీ చేశారనేది పూర్తిగా అబద్దం, అవాస్తమని షర్మిల పేర్కొన్నారు. 
 
తన తండ్రి వైఎస్ఆర్ ఎపుడూ కూడా తనను తక్కువ చేసి చూడలేదని, ఆయన సమాన వాటా ఉండాలని అనేవారని చెప్పారు. వైఎస్ స్థాపించినవన్నీ కుటుంబ వ్యాపారాలేనని, ఆ వ్యాపారాలకు జగన్ ఒక గార్డియన్ మాత్రమేనని ఆమె గుర్తు చేశారు. వైఎస్ ఉద్దేశమేమిటో కుటుంబ సభ్యులకు, సన్నిహితులందరికీ తెలుసని అన్నారు. ఆయన బతికివున్నంతవరకు ఏ ఒక్క ఆస్తి పంపకం కూడా జరగలేదని తెలిపారు. అలాగే, వైఎస్ మరణించిన తర్వాత కూడా ఏ ఆస్తి పంపకాలు చేపట్టలేదన్నారు. ఇవాళ్లి వరకు తనకు న్యాయంగా రావాల్సిన ఒక్క ఆస్తి కూడా తన చేతుల్లో లేదని షర్మిల వాపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments