Webdunia - Bharat's app for daily news and videos

Install App

4 భాషలు తెలిసిన సీఎం జగన్ ప్రధానిగా ఎదుగుతారు : నూజివీడు ఎమ్మెల్యే

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (09:54 IST)
భారత దేశంలోనే నాలుగు భాషలు తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, ఆయన దేశ ప్రధానిగా ఎదుగుతారని నూజివీడు ఎమ్మెల్యే వెంకట ప్రతాప్ అప్పారావు జోస్యం చెప్పారు. 
 
విజయవాడలో గురువారం జరిగిన గృహ నిర్మాణాల సమీక్షలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌పై ప్రశంసలవర్షం కురిపించారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో నాలుగు భాషలు తెలిసి, నాలుగు భాషల్లో మాట్లాడగలిగే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఇళ్ల నిర్మాణానికి అదనపు రుణాన్ని రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచాలని కోరారు. 
 
ఆ తర్వాత పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ మాట్లాడుతూ మరో 30 ఏళ్లపాటు జగనే ఈ రాష్ట్రాన్ని పాలిస్తారని అన్నారు. జియో ట్యాగింగ్‌లో కాలయాపన జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విజయవాడకు చెందిన లబ్ధిదారుల కోసం మైలవరం నియోజకవర్గంలో భూములు కొనుగోలు చేసిన విషయాన్ని అధికారులు తనకు చెప్పనేలేదని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments