Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఎస్ఈ టెన్త్‌లోనే తెలంగాణాలో పది పరీక్షలు

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (09:44 IST)
సెంట్రల్ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు చేయనుంది. ఈ విధానాన్నే పదో తరగతిలోనూ ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా రెండుసార్లు వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. 
 
ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ), ప్రభుత్వ పరీక్షల విభాగం (ఎస్ఎస్‌సీ బోర్డు) అధికారులు కసరత్తుకు శ్రీకారం చుట్టారు. 
 
తూతూమంత్రంగా పరీక్షలు నిర్వహించిన గ్రేడ్‌లు కేటాయించొద్దన్న కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే టెన్త్ విద్యార్థులు ఇకపై రెండుసార్లు బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. 
 
తొలి ఆరు నెలలకు నవంబరు/డిసెంబరులో, ఆ తర్వాతి ఆరు నెలలకు విద్యా సంవత్సరం చివరిలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండింటిలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలు ప్రకటిస్తారు.
 
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండేళ్ళుగా విద్యా రంగం తీవ్రంగా నష్టపోయిన విషయం తెల్సిందే. ముఖ్యంగా ఈ  యేడాది ఏ ఒక్క పరీక్షను కూడా నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. దీంతో సీబీఎస్ఈ యేడాదిలో రెండు బోర్డు పరీక్షలు నిర్వహించాలని భావించాలని నిర్ణయించగా, ఇదే విధానాన్ని తెలంగాణ సర్కారు అనుసరించనున్నారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments