Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈనెల 30న తిరుమలకు సీఎం వైయస్‌.జగన్‌ ... షెడ్యూల్ ఇదే...

Webdunia
ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (10:39 IST)
ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి ఈనెల 30వ తేదీన తిరుమల వెళ్లనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సెప్టెంబరు 30వ తేదీ మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా తిరుచానూరు వెళ్తారు. తిరుచానూరులో పద్మావతి నిలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. అక్కడనుంచి అలిపిరి వెళ్తారు. 
 
అలిపిరి నుంచి చెర్లోపల్లి వరకూ నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత తిరుమల వెళ్తారు. తిరుమలలో మాతృశ్రీ వకుళాదేవి విశ్రాంతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న మరో కాంప్లెక్స్‌నిర్మాణానికీ సీఎం శంకుస్థాపన చేస్తారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత పెద్దశేషవాహన సేవలో పాల్గొంటారు. రాత్రికి తిరుమలలోనే బసచేసి అక్టోబరు ఒకటో తేదీన ఉదయం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments