Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫుల్ జోష్‌లో జగన్ సర్కార్.. ఎలా?

ఫుల్ జోష్‌లో జగన్ సర్కార్.. ఎలా?
, శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (19:40 IST)
విమర్శలు ఎదుర్కొన్న అంశాల్లోనే విజయం సాధించి ఫుల్ జోష్‌లో ఉంది జగన్ సర్కార్. కీలక నిర్ణయాల అమలులో వెనక్కి తగ్గకుండా ముందుకెళ్ళి విజయం సాధించింది. రివర్స్ టెండరింగ్ విధానం సూపర్ సక్సెస్ అయ్యింది. పోలవరం ప్రాజెక్టుతో ప్రారంభమైన రీటెండరింగ్ విధానం ద్వారా 839 కోట్ల ఆదాయం అయ్యిందట.
 
మొదట్లో విమర్శలు వచ్చినా జగన్ మాత్రం వెనుకడుగు వేయలేదట. దీంతో నవంబర్ మాసంలో పనులను ప్రారంభించనున్నారట. ఈ ఒక్క నిర్ణయం ప్రభుత్వంతో కొత్త జోష్ నింపిందట. ఈ నిర్ణయం ఫుల్ బూస్ట్‌తో ప్రతిపక్ష పార్టీకి దిమ్మతిరిగేలా చేశారంటున్నారు విశ్లేషకులు.
 
ఐదేళ్ళలో పోలవరంను పూర్తిచేస్తే మాజీ మంత్రి దేవినేని ఉపమహేశ్వరరావు రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు అధికారపార్టీ నేతలు. పిపిఎల విషయంలో రీవెరిఫై చేసి అందులోను ప్రభుత్వం విజయం సాధించబోతోందట. గ్రామసచివాలయ పరీక్షా పత్రాలు లీకేజీ అయినట్లు విమర్సలు వస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు అస్సలు వాటిని పట్టించుకోలేదు. ఏకంగా లక్షా 30 వేల ఉద్యోగాలు రావడంతో అభ్యర్థులు కూడా సైలెంట్‌గా ఉన్నారు. దీంతో తాము తీసుకుంటున్న నిర్ణయాలన్నీ అద్భుతంగా ఉన్నాయని తెగ సంబరపడిపోతున్నారు సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా గుర్తింపు