Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు పారిస్‌ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (08:58 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం నుంచి ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు తన సతీమణితో కలిసి వెళుతున్నారు. పలు అవినీతి కేసుల్లో నిందితుడుగా ఉన్న సీఎం జగన్‌కు విదేశాలకు వెళ్లేందుకు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ నెల 28వ తేదీ నుంచి జూలై పదో తేదీ వరకు పారిస్‌లో పర్యటించేందుకు సమ్మతం తెలిపింది. 
 
జగన్ కుమార్తె పారిస్‌లో విద్యాభ్యాసం చేస్తున్నారు. తన కుమార్తె విద్యనభ్యసిస్తున్న కళాశాల స్నాతకోత్సవంలో హాజరయ్యేందుకు ఆయన పారిస్ వెళుతున్నారు. ఇందుకోసం ఆయన మంగళవారం రాత్రి 7.30 గంటలకు గన్నవరం నుంచి పారిస్‌కు బయలుదేరే జగన్ జూన్ రెండో తేదీ వరకు అక్కడే ఉంటారు. జూలై 3వ తేదీన తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకుంటారు. సీఎం జగన్ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments