ఆయనంత మూర్ఖుడు లేరు? రూ.4వేల కోట్లు ఎలా ఖర్చు పెడతారో చూస్తా: జగన్

నంద్యాల ఎన్నికల్లో గెలుపొందిన తెలుగుదేశం పార్టీపై వైకాపా చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. నంద్యాల విజయం ఏ రకంగా ఏపీ సీఎం చంద్రబాబు విజయం అవుతుందో చెప్పాలన్నారు. నంద్యాల గెలుపు బాబుది కాదని.. అ

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (12:28 IST)
నంద్యాల ఎన్నికల్లో గెలుపొందిన తెలుగుదేశం పార్టీపై వైకాపా చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. నంద్యాల విజయం ఏ రకంగా ఏపీ సీఎం చంద్రబాబు విజయం అవుతుందో చెప్పాలన్నారు. నంద్యాల గెలుపు బాబుది కాదని.. అది బాబు గెలుపనుకుంటే ఆయనంత మూర్ఖుడు ఇంకెవరుండరన్నారు. పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు సవాలు విసిరారు.
 
వైకాపా నుంచి గెలుపొందిన 20 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలన్నారు. ఆ ఎన్నికల్లో రూ.4వేల కోట్లు ఎలా ఖర్చు పెడ్తారో చూస్తానన్నారు. రాజకీయాల్లో గుండె ధైర్యం వుండాలని.. ఎన్నికల్లో అవతలి వ్యక్తి ఎంత గట్టిగా కొట్టాడో....అంత గట్టిగా తీసుకోగలుగుతానో రేపటి విజయానికి నాంది అన్నారు. చంద్రబాబుకు భయపడి ప్రజలు ఓటేశారని జగన్ వ్యాఖ్యానించారు.
 
రేషన్ కార్డుల నుంచి కరెంట్ బిల్లుల వరకు ప్రజలను చంద్రబాబు మోసం చేశారని జగన్ విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావనే కారణంతోనే టీడీపీ గెలిచిందన్నారు. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments