Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తితిదే మాజీ ఈవో... మాజీ ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ కన్నుమూత

మాజీ ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈవో, ప్రముఖ రచయిత పీవీఆర్కే ప్రసాద్ మృతిచెందారు. ఆయన వయసు 77 యేళ్లు. అనారోగ్యంతో హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ గుండెపోటుతో సోమవారం తెల్లవారుజ

తితిదే మాజీ ఈవో... మాజీ ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ కన్నుమూత
, సోమవారం, 21 ఆగస్టు 2017 (10:02 IST)
మాజీ ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈవో, ప్రముఖ రచయిత పీవీఆర్కే ప్రసాద్ మృతిచెందారు. ఆయన వయసు 77 యేళ్లు. అనారోగ్యంతో హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ గుండెపోటుతో సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు కూడా సోమవారమే పంజాగుట్ట శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. 
 
మాజీ ప్రధానమంత్రి నరసింహారావుకు మీడియా సలహాదారునిగా కూడా కొనసాగారు. అంతేకాకుండా, బాబ్రీ మసీదు కూల్చివేత, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ రాజీనామా తదితర విషయాలను వివరిస్తూ 'అసలేం జరిగిందంటే' పేరిట యధార్థ సంఘటనలతో ఓ పుస్తకం రాయగా, అది సంచలనం సృష్టించింది. ఇంకా 'కర్త అతడే', 'తిరుమల చరితామృతం', 'తిరుమల లీలామృతం'.. వంటి పుస్తకాలు కూడా రాశారు. 
 
పీవీఆర్‌కే ప్రసాద్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విపక్ష నేత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. పీవీఆర్‌కే ప్రసాద్‌ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు సలహాదారుగా సుదీర్ఘకాలం పనిచేశారు. అలాగే తిరుమల ప్రాశస్త్యంపై ఆయన పలు పుస్తకాలు రాశారు. పీవీఆర్‌కే‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌తో బీజేపీ దోస్తీ.. ఫలించిన గాలి జనార్ధన రెడ్డి రాయబారం..!?