Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పార్టీ వైకాపాను వీడనున్న 50 మంది ఎమ్మెల్యేలు?!!

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2023 (14:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన సొంత పార్టీ వైకాపాను ఆ పార్టీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేల్లో 50 మంది పార్టీని వీడినున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీకి చెందిన రెబెల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. కృష్ణాతో పాటు జిల్లాలకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలంతా పక్క చూపులు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. 
 
ఇటీవల గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. దీంతో వైకాపాలో ప్రకంపనలు మొదలయ్యాయని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ మాకొద్దు అంటే మాకొద్దని ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటున్నారంటే, వైకాపా మునిగిపోయే పడవని వారికి అర్థమైందన్నారు. 
 
ప్రజా తీర్పు అధికార వైకాపాకు వ్యతిరేకమని తేలడంతో, చిల్లుపడిన పడవ నుంచి దూకి ఒడ్డుకు చేరుకునేందుకు చాలామంది ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోందన్నారు. వైకాపా అధిష్ఠానం అరాచకాలు, శాసనసభ్యులను అగౌరవపరచడం, అమానవీయంగా ప్రవర్తించడం వంటి సంఘటనలు వారిని తీవ్రంగా కలిచి వేసి, ఆ నిర్ణయానికి పురిగొల్పాయన్నారు. ప్రస్తుత శాసన సభ్యుల్లో 75 నుంచి 80 మందిని మారుస్తారని తెలిసిందన్నారు. చిలకలూరిపేటలో పనికిరాని మంత్రి రజిని గుంటూరులో ఎలా పనికివస్తారని ఆయన ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments