Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రిపదవి ఊడినందుకు మొక్కులు తీర్చుకున్న వైకాపా నేతలు

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (09:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా అధికారంలో ఉంది. ఈ పార్టీకి చెందిన కొందరు నేతలు తమ పార్టీ నేతలపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిలో మాజీ మంత్రి శంకర నారాయణ ఒకరు. ఈయన మంత్రిగా ఉన్నపుడు పెనుకొండ నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలనే ముప్పతిప్పలు పెట్టారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించారు. దీంతో ఆయన వ్యతిరేక వర్గీయులు పండగ చేసుకున్నారు. 
 
శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో జరిగింది. ఇది అధికార పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. పెనుకొండ వైకాపాలో అమ్మోరికి అసమ్మతి నేతలు పొట్టేలు సమర్పించి మరీ పండగ చేసుకున్నారు. అంటే అసమ్మతి నేతలు మొక్కు చెల్లించుకున్నారు. శంకర నారాయణకు మంత్రి పదవి ఊడినందుకు స్థానికంగా ఉండే సుంకులమ్మకు గొర్రె పొట్టేలును బలిచ్చి మొక్కు తీర్చుకున్నారు. 
 
ఈ మొక్కు తీర్చుకున్నవారిలో పెనుకొండ వైకాపా అసమ్మతి నేతలు గంపల రమణారెడ్డి, కర్రా సంజీవ రెడ్డి, దిలీప్ రెడ్డి తదితరులు ఉన్నారు. వీరు పేరుతో సోషల్ మీడియాలో విందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. విందు కోసం తెప్పించిన పొట్టేళ్ళను సోషల్ మీడియాలో వైకాపా అసమ్మతి నేతలు పోస్ట్ చేయడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments