Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రిపదవి ఊడినందుకు మొక్కులు తీర్చుకున్న వైకాపా నేతలు

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (09:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా అధికారంలో ఉంది. ఈ పార్టీకి చెందిన కొందరు నేతలు తమ పార్టీ నేతలపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిలో మాజీ మంత్రి శంకర నారాయణ ఒకరు. ఈయన మంత్రిగా ఉన్నపుడు పెనుకొండ నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలనే ముప్పతిప్పలు పెట్టారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించారు. దీంతో ఆయన వ్యతిరేక వర్గీయులు పండగ చేసుకున్నారు. 
 
శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో జరిగింది. ఇది అధికార పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. పెనుకొండ వైకాపాలో అమ్మోరికి అసమ్మతి నేతలు పొట్టేలు సమర్పించి మరీ పండగ చేసుకున్నారు. అంటే అసమ్మతి నేతలు మొక్కు చెల్లించుకున్నారు. శంకర నారాయణకు మంత్రి పదవి ఊడినందుకు స్థానికంగా ఉండే సుంకులమ్మకు గొర్రె పొట్టేలును బలిచ్చి మొక్కు తీర్చుకున్నారు. 
 
ఈ మొక్కు తీర్చుకున్నవారిలో పెనుకొండ వైకాపా అసమ్మతి నేతలు గంపల రమణారెడ్డి, కర్రా సంజీవ రెడ్డి, దిలీప్ రెడ్డి తదితరులు ఉన్నారు. వీరు పేరుతో సోషల్ మీడియాలో విందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. విందు కోసం తెప్పించిన పొట్టేళ్ళను సోషల్ మీడియాలో వైకాపా అసమ్మతి నేతలు పోస్ట్ చేయడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments