Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్యే ప్రశ్నలకు బేల ముఖం పెట్టిన సీఎం జగన్!!

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (18:28 IST)
వైకాపా ఎమ్మెల్యే ఒకరు సంధించిన ప్రశ్నలకు వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బేలముఖం పెట్టేశారు. ఆ దళిత ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక చిన్నబుచ్చుకున్నారు. పైగా, ఇద్దరు పెద్ద రెడ్లు చెప్పినట్టుగానే నాలుగున్నరేళ్లుగా నడుచుకున్నానని, ఇపుడు తన పనితీరు బాగాలేదంటూ ఎలా అని నిలదీశారు. తన పనితీరు బాగులేదని చెప్పడం కాదనీ, ఆ పెద్ద రెడ్ల పనితీరే ఏమాత్రం బాగాలేదని సీఎం జగన్ ముఖంమీదే ఆ దళిత ఎమ్మెల్యే తేల్చి చెప్పాడు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు.. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. 
 
సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు తాడేపల్లి ప్యాలెస్‌కు ఎంఎస్ బాబు వెళ్లారు. ఆ సమయంలో మీ పనితీరు బాగోలేదని, పైగా, వచ్చే ఎన్నికల్లో పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే మీ స్థానంలో మరో అభ్యర్థిని బరిలోకి దించుతున్నట్టు, అందువల్ల పార్టీ విజయం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే బాబుకు సీఎం జగన్ చూపించారు. దీనికి ఎమ్మెల్యే బాబు కూడా ఘాటుగానే సమాధానమిచ్చారు. 
 
గత నాలుగున్నరేళ్ళుగా ఇద్దరు పెద్ద రెడ్లు చెప్పినట్టుగానే నడుచుకున్నానని, ఇపుడు తనపై వ్యతిరేకత ఉందంటే ఎవరి బాధ్యత అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఒక్కసారి కూడా తనను పిలిచి మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఈ దఫా పూతలపట్టు టిక్కెట్ ఆశించవద్దని చెప్పడం ఏమాత్రం తగదన్నారు. పైగా, డబ్బులు ఇస్తే ఐప్యాక్ టీమ్ ఏ విధంగా అయినా నివేదికలు మార్చుతుందని, పార్టీలో దళితులకు టిక్కెట్లు కేటాయించే విషయంలో అన్యాయం జరుగుతుందని సీఎం జగన్ ముంగిటే తన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సీఎం జగన్ ఏం చెప్పాలో తెలియక బిక్కమొహం పెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

నాలో చిన్నపిల్లాడు ఉన్నాడు, దానికోసం థాయిలాండ్ లో శిక్షణ తీసుకున్నా: తేజ సజ్జా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments