Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీలో చేరేందుకు పయనమైన వైసీపీ నేత, గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (11:30 IST)
టీడీపీలో చేరేందుకు హైదరాబాదు పయనమైన వైసీపీ నేతను కొందరు గుర్తు తెలియని వ్యక్తు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డులో జరిగింది. గుంటూరు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలోని చండ్రాజు పాలేనిని చెందిన వైసీపీ నేత గాదె వెంకటరెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
 
ఇందులో భాగంగా తన అనుచరులతో కలిసి నిన్న ఉదయం హైదాబాదులోని ఎన్టీఆర్ భవన్‌కు బయలుదేరారు. ముందు ఆయన వాహనంలో వెళ్తుండగా మరో వందమంది ఆయన అనుచరులు ఎడెనిమిది వాహనాల్లో బయలు దేరారు. అయితే వారు మిర్యాలగూడ  చేరుకునేసరికి గుర్తు తెలియని వ్యక్తులు వెంకటరెడ్డిని కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. దీంతో తమ అనుచరులు ఏమీ చేయలేక వెనుదిరిగారు.
 
విషయం తెలుసుకున్న వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే సాయంత్రం ఏడు గంటల సమయంలో తాను హైదరాబాదులో క్షేమంగా ఉన్నానని ఫోన్లో తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్నాళ్లుగా వైసీపీపై విరక్తి చెందిన వెంకట రెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేరనీయకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఇదంతా వైసీపీ కుట్ర అని తెలిపారు. కానీ దీనిపై కేసు నమోదు కాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments