Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ప్రభావం, దీపావళి టపాసులపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (09:50 IST)
కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రాని నేపథ్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న దీపావళిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ఆంక్షలను విధించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు మేరకు ఈ ఆంక్షలు విధిస్తున్నామని తెలిపింది.
 
శనివారం నాడు రాత్రి పూట కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసులు పేల్చుకోవాలని తెలిపింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాకాయలను కాల్చేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అవి కూడా పర్యావరణానికి మేలు కలిగించే గ్రీన్ క్రాకర్స్ మాత్రమే పేల్చాలని తెలిపింది.
 
రాష్ట్రంలో కరోనా బాధితులు, పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్ననట్లు తెలిపింది. ఇక టపాకాయలు విక్రయించే షాపుల మధ్య దూరం తప్పనిసరి అని తెలిపింది. కొనుగోలుదార్లను కూడా 6 అడుగుల భౌతికదూరం పాటించేలా చూడాల్సిన బాధ్యత షాపు యాజమాన్యానికి ఇచ్చింది. ఈ షాపుల వద్ద పేలుడు స్వభావం కలిగిన శానిటైజర్లను వాడరాదని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments