Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు భాష గురించి నువ్వా మాట్లాడేది చంద్రబాబూ?

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (11:16 IST)
తెలుగు భాష గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేద‌ని, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మండిప‌డ్డారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్టాడుతూ, తెలుగు గురించి నువ్వా మాట్లాడేది చంద్రబాబూ అని ఎద్దేవా చేశారు.

తెలుగు అకాడమీకి తెలుగు సంస్కృత అకాడమీగా పేరు మారిస్తే ,వచ్చే నష్టమేంటని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తన హయాంలో తెలుగు అకాడమీ పేరు కూడా ఉచ్చరించలేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైఎస్‌ జగన్‌ అధికార భాషా సంఘానికి గుర్తింపు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.

గ‌తంలో చంద్రబాబు సీఎంగా ఉన్న‌పుడు ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితంగా మెలిగిన యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్ర‌సాద్ వైసీపీ ప్ర‌భుత్వం రాగానే, సీఎం జ‌గ‌న్ పంచ‌న చేరారు. ఆయ‌న‌ను భాషా సంఘం అధ్య‌క్ష ప‌దవి నుంచి తొల‌గిస్తార‌నే, ఊహాగానాలు కూడా అప్ప‌ట్లో వెలువ‌డ్డాయి.

కానీ, వైసీసీ అండ‌దండ‌ల‌తో యార్ల‌గ‌డ్డ కొన‌సాగుతూ వ‌చ్చారు. ఇపుడు తాజాగా ఇంగ్లిష్ మీడియం, తెలుగు, సంస్కృత అకాడ‌మీల అంశం తెర‌పైకి రావ‌డంతో... వైసీపీ త‌ర‌ఫున చంద్ర‌బాబు కౌంట‌ర్లు ఇవ్వ‌డానికి తొలిసారి యార్ల‌గ‌డ్డ మీడియా ముందుకు వ‌చ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments