Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 నెలల్లో రూ.1.26 లక్షల కోట్లు అప్పులతో జగన్ రికార్డ్: యనమల రామకృష్ణుడు

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (14:57 IST)
సీఎం జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకాలు చేసి ఢిల్లీ వెళ్లి చీవాట్లు తినడం జగన్‌కు ఆనవాయితిగా మారిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అభివృద్ధి కంటే తన కేసుల భవిష్యత్తే జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమని తెలిపారు.
 
గత 16 నెలల్లో కేంద్రం నుంచి జగన్ ఏం సాధించుకొచ్చారో చెప్పాలని అన్నారు. 16 నెలల్లో రూ.1.26 లక్షల కోట్లు అప్పులు తేవడమే జగన్ రికార్డ్ అని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు 31వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులతో గిన్నిస్ రికార్డ్ నమోదు చేశారని, కానీ జగన్ అప్పులు తేవడంతో వరల్డ్ రికార్డ్ సృష్టించారని ఎద్దేవా చేశారు.
 
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై గొగ్గోలు పెట్టిన వైసీపీ నోరు ఇప్పుడెందుకు మూతపడిందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా పేరెత్తడం మరిచిపోయి 16 నెలలు గడిచిపోయిందని విమర్శించారు. అయినా జగన్ ఢిల్లీ వెళ్లింది సంజాయిషీలు ఇవ్వడానికే తప్ప రాష్ట్రానికి రావలసినవి రాబట్టుకోవడానికి కాదని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments