Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూడ్స్ రైలు కింద ఓ పిల్లాడు చిక్కుకున్నాడు.. ఏమైందంటే? (video)

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (14:43 IST)
గూడ్స్ రైలు కింద ఓ పిల్లాడు చిక్కుకున్నాడు. ఆ గూడ్స్ రైలు పిల్లాడిపై నడుచుకుంటూ పోయింది. కొంతదూరంలో ఓ పిల్లాడు పట్టాలపై ఆడుకుంటూ కనిపించాడు. హారన్ గట్టిగా మోగించినా పక్కకు తప్పుకోలేదు. అతడిని ఎలాగైనా కాపాడాలని ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు లోకో పైలట్లు. ట్రైన్ కాస్త దూరం వెళ్లి ఆగిపోయింది. కానీ అప్పటికే బాబు మీద నుంచి వెళ్లిపోయింది.
 
రైలు ఆగిన వెంటనే ఇంజిన్ నుంచి ఇద్దరు లోకో పైలట్లు దిగి పట్టాలను పరిశీలించారు. ఇంజిన్ కింది భాగంలో చిక్కుకుపోయిన పిల్లాడు.. ఏడుస్తూ.. భయపడుతూ కనిపించాడు. అంతేతప్ప ఎలాంటి గాయాలు కాలేదు. క్షేమంగానే ఉన్నాడు. ఇంజిన్ కింద భాగంలో ఉండిపోయిన బాలుడిని లోకో పైలట్లు చాకచాక్యంగా బయటకు తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 
 
ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా బల్లాబ్‌గఢ్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. 14 ఏళ్లు బాలుడు రెండేళ్ల తన తమ్ముడితో కలిసి ఆడుకున్నాడు. ఆ తర్వాత అతడు వెళ్లిపోవడంతో.. రెండేళ్ల బాలుడు నడుచుకుంటూ పట్టాలపైకి చేరుకున్నాడు. అదే సమయంలో రైలు దూసుకొచ్చింది. లోకో పైట్ల ధీవన్, అతుల్ చాకచక్యంగా బ్రేకులు వేయంతోనే ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments