Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే.. స్పీకర్‌ను ఆదేశించండి : హైకోర్టులో జగన్ పిటిషన్!!

వరుణ్
బుధవారం, 24 జులై 2024 (10:18 IST)
ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇపుడు అధికారమే కాదు ఏకంగా ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయారు. ఇపుడు కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. దీన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే తనకు ప్రతిపక్ష హోదా కల్పించేలా అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్, స్పీకర్ కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ కార్యదర్శి లా అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ ముఖ్యకార్య దర్శి, స్పీకర్ కార్యదర్శితో పాటు వ్యక్తిగత హోదాలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. 
 
శాసనసభ సంప్రదాయం ప్రకారం అధికార పార్టీ శాసనసభా పక్షనేత ప్రమాణం పూర్తి అయిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభాపక్ష నేతతో ప్రమాణం చేయించాలని పిటి‌షన్‌లో పేర్కొన్నారు. అందుకు విరుద్ధంగా అధికార పార్టీ శాసనసభా పక్షనేత తర్వాత మంత్రుల చేత ప్రమాణం చేయించారని, వారి తర్వాత తనకు ప్రమాణం చేసే అవకాశం ఇచ్చారన్నారు. ఇది గమనించిన తర్వాత వైసీపీఎల్పీకి ప్రధాన ప్రతిపక్షపార్టీ హోదా, తనకు ప్రతిపక్షనేత హోదాను ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్లు అర్థమైందన్నారు. 
 
'టీడీపీ-జనసేన-బీజేపీ' పార్టీలు కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయడమేకాకుండా, మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. వైసీపీ మాత్రమే ప్రతిపక్ష పార్టీగా ఉందని చెప్పేందుకు ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తకుండా చేసేందుకే వైసీపీఎల్పీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇంకా పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని శాసనసభలో తనకు ప్రతిపక్షనేత హోదా కల్పించేలా ఆదేశాలు ఇవ్వండి' అని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments