Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కృష్ణా జిల్లా యువతి మృతి.. ఎలాగంటే...

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (07:52 IST)
కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువతి అమెరికాలో ప్రాణాలు కోల్పోపోయింది. కొలంబియాలో ఉంటున్న ఆమె... తమ బంధువులను చూసేందుకు వెళుతూ మార్గమధ్యంలో ఓ జలపాతం వద్ద సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు గ్రామానికి చెందిన పోలవరకు కమల (26) అనే యువతి అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం కొలంబియాలో ఉంటున్న ఆమె శనివారం బంధువుల ఇంటికి వెళ్లి వస్తూ మార్గమధ్యంలో జలపాతం వద్ద ఆగారు. 
 
కొద్దిసేపు జలపాతం అందాలు తిలకించిన ఆమె.. ఆ తర్వాత సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు జలపాతంలో జారిపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం సహకారంతో కమల మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments